భర్తకి తెలీకుండా ప్రియుడితో చాటింగ్.. ఎప్పటికపుడు మెసేజ్ డిలీట్.. చివరకు ఏమైందంటే..?

భర్తకి తెలీకుండా ప్రియుడితో చాటింగ్.. ఎప్పటికపుడు మెసేజ్ డిలీట్.. చివరకు ఏమైందంటే..?

by Anudeep

Ads

ఒడిశా రాజధాని భువనేశ్వర్ వద్ద భీమతంగి గ్రామం లో ఓ వివాహిత ను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పెళ్లి అయిన అమ్మాయిని, ఆమె కొడుకుని ప్రియుడే హత్య చేయాలని ప్రయత్నించాడు. బాబు ఇంట్లో లేకపోవడం తో అమ్మాయిని మాత్రమే హత్య చేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే,

Video Advertisement

priyanka 1

జాజ్ పూర్ కు చెందిన ప్రియాంక ప్రియదర్శిని, జగన్నాధ్ ప్రదాన్ లకు కొంతకాలం గా పరిచయం ఉంది. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు. అయితే.. 2014 లో ప్రియాంక కు రాకేష్ తో వివాహామైనది. వీరిద్దరికి మూడు సంవత్సరాల పిల్లాడు కూడా ఉన్నాడు. ప్రియాంక భర్త రాకేష్ యురేకా ఫోర్బ్స్ లో పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమం లోనే ప్రియాంకకు జగన్నాధ్ తో ఉన్న పాత పరిచయం తిరిగి మొదలైంది. వీరిద్దరూ చాట్ చేసుకునేవారు. ఎప్పటికప్పుడు ప్రియాంక ఈ చాట్ ను డిలీట్ చేసేది. భర్త కు తెలీకుండా జాగ్రత్త పడింది.

priyanka 2

వీరిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియరాలేదు. కానీ ఓ రోజు జగన్నాధ్ ప్రియాంక ఇంటికి వచ్చి.. ఆమెను, ఆమె కొడుకుని హత్య చేయాలని భావించాడు. కానీ.. పిల్లవాడు పక్కన ఇంటికి ఆడుకోవడానికి వెళ్లడం తో ప్రాణాలు దక్కించుకున్నాడు. జగన్నాధ్ ప్రియాంకను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ప్రియాంక భర్త కు కాల్ చేసాడు. ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడేలోపు కాల్ కట్ అయింది. అనుమానం వచ్చిన రాకేష్ తన ఓనర్ కి కాల్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని కోరాడు.

priyanka

అప్పటికే.. ప్రియాంక రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. కొన ఊపిరి తో ఉన్న జగన్నాధ్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందగానే పోలీసులు వచ్చి పరిశీలించారు. జగన్నాధ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. అతను కోలుకుని, ఏమి జరిగిందో చెప్తే తప్ప ఈ హత్య మిస్టరీ వీడే అవకాశం లేదు.


End of Article

You may also like