తన అందచందాలతో యువకులకు వలవేసి.. ప్రేమ పేరు తో నమ్మిస్తోంది.. ఆ తరువాత ఏమి చేస్తోందంటే..?

తన అందచందాలతో యువకులకు వలవేసి.. ప్రేమ పేరు తో నమ్మిస్తోంది.. ఆ తరువాత ఏమి చేస్తోందంటే..?

by Anudeep

Ads

పెళ్లి కానీ యువకులనే ఆ యువతి టార్గెట్ చేస్తోంది. తన అందం తో వారిని ప్రేమలో పెట్టి.. తానూ అనాధనంటూ అబద్ధం చెప్పి.. నువ్వు తప్ప ఇంకెవరు లేరు అంటూ వారిని తన చుట్టూ తిప్పుకుంటోంది. వారు ప్రేమలో పడ్డాకా పెళ్లి చేసుకొమ్మని అడుగుతోంది. పెళ్లి చేసుకోమని అడిగేసరికి.. వారు కూడా ఆమె వలలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటున్నారు.ఆ తరువాత ఆమె వారి నగలు, డబ్బు తీసుకుని పారిపోతోంది. తాజాగా చిత్తూరు జిల్లా విజయపురం మండలం లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Video Advertisement

chitturu women 1

చిత్తూర్ జిల్లా కు చెందిన సునీల్ కుమార్ తిరుపతి లో ఓ సంస్థ లో మార్కెటింగ్ విభాగం లో పని చేస్తున్నారు. అదే ఆఫీస్ లో పనిచేస్తున్న సుహాసిని కి సునీల్ తో పరిచయం ఏర్పడి ప్రేమ గా మారింది. సుహాసిని తనను తాను అనాధనని చెప్పుకుని సునీల్ ను ముగ్గులోకి దింపింది. సునీల్ కూడా తల్లితండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పెళ్లి లో పది తులాల బంగారం కూడా పెట్టాడు. ఆ తరువాత తనను పెంచిన వారికి కొంత డబ్బు అవసరమైనదని చెప్పి ఆమె సునీల్ నుంచి ఆరు లక్షల రూపాయలు తీసుకుంది.

wedding

కొన్నాళ్ల తరువాత సునీల్ మరియు అతని తల్లితండ్రులు డబ్బుల గురించి సుహాసిని ని అడిగారు. దీనితో.. ఆమె చెప్పాపెట్టకుండా పారిపోయింది. అనుమానం తో సునీల్ పోలీసులను ఆశ్రయించాడు. ఆమె ఆధార్ నెంబర్ ను ట్రేస్ చేసి పోలీసులు ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆమె గతం లో కూడా ఇలానే చేసిందని తెలుస్తోంది. ఆమెకు తన మేనమామ తో అంతకుముందే పెళ్లి అయిపొయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

chitturu women 2

ఇది కాక, ఆమె భద్రాద్రి కొత్తగూడెం లో వినయ్ అనే వ్యక్తిని కూడా ప్రేమించి, పెళ్లి చేసుకుని ఇలానే మోసం చేసిందని తేలింది. భర్త సహకారం తోనే ఆమె ఇలాంటి పనులు చేస్తోందని పోలిసుల విచారణలో తేలింది. ఇలా సేకరించిన నగలు, డబ్బుని కూడా భర్తకే ఇస్తోందని తెలుస్తోంది. ఇలాంటి వారి మాయలో పడవద్దని పోలీసులు యువకులకు హితవు చెప్తున్నారు.


End of Article

You may also like