కరోనా సోకి చనిపోయిన నర్స్…చివరిగా భర్తతో ఏమన్నారో తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

కరోనా సోకి చనిపోయిన నర్స్…చివరిగా భర్తతో ఏమన్నారో తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

by Megha Varna

Ads

యూరోప్ దేశాలలో ప్రధాన దేశమైన బ్రిటన్ లో కరోనా కల్లోలం అంతాఇంతా కాదు ..అక్కడ కరోనా మృతుల సంఖ్య  చూస్తూ ఉంటే పరిస్థితి ఏంత  ఘోరంగా ఉందొ మనకు తెలుస్తుంది ..ఈ కరోనా ని ఆపాలంటే వున్న ఏకైక మార్గం సామజిక దూరం అని దానితోనే మనం కరోనా ని తరిమికొట్టగలమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ..కరోనా కారణంగా సాధారణ ప్రజలే కాకుండా వైద్య  బృందం కూడా ఈ మహమ్మరి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం కలవరం రేపుతోంది . నస్రిన్ అనే నర్స్  కరోనా వలన మృతి చెందింది ..చనిపోయే సమయాన ఆమె భర్త ఆవిడ పక్కనే ఉండగా నస్రిన్ ఆయనతో చెప్పిన మాటలు కళ్ళు చెమర్చేలా చేస్తాయి ..

Video Advertisement

నస్రిన్ (38 )పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి. చాలా ఏళ్ళగా బ్రిటన్‌లోని ఓ ఆసుపత్రిలో హెల్త్ కీపర్ గా ఎన్నో సేవలను అందిస్తూ నర్స్ మీద వున్నా ఆశక్తితో నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి అదే ఆసుపత్రిలోనర్స్ గా  జాయిన్ అయ్యింది నస్రిన్ …ఆమెకు భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు.తాజాగా కరోనా బ్రిటన్ లో విలయ తాండవం చేస్తుండడంతో నస్రిన్ రోగుల సేవలో మునిగిపోయింది. తన భాద్యత మరిచిపోకుండా కరోనా సోకిన వ్యక్తులకు సేవ చేయడంలో తన వంతు ఉపకారం అందించింది.ఈ నేపథ్యంలో ఆమె కరోన సోకింది..కాగా ఆమె పరిస్థితి బాగుండక పోవడంతో డాక్టర్లు బ్రతకడం కష్టం అని చెప్పేసారు ..

విషయం తెలుసుకున్న భర్త   నస్రిన్ ను చూసేందుకు  భర్త హాస్పిటల్ కు వచ్చాడు ..తన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో మాట్లాడలేని పరిస్థితిలో తన భర్తతో పిల్లలు జాగ్రత్త అంటూ తన సైగలా ద్వారా చెప్పింది ..దింతో ఆమె భర్త దగ్గరకి వెళ్లి నువ్వు ఏమి బాధపడకు నీకంటే బాగా పిల్లలను చూసుకుంటాను అని చెప్పాడు …ఆ తర్వాత కొద్దీ క్షణాలకే నస్రిన్ ప్రాణాలు కోల్పోయింది ..నస్రిన్ కు ఆ హాస్పిటల్ కు చాల సుదీర్ఘ సంబంధం ఉండడంతో అంత కన్నీటి పర్యంతమయ్యారు …ఈ విషయం తెలిసిన వారు అందరూ కన్నీరు పెట్టుకున్నారు.


End of Article

You may also like