అప్పుడు రాశి ఖన్నా.. ఇప్పుడు కృతి శెట్టి.. ఈ Coincidence ను గమనించారా..?

అప్పుడు రాశి ఖన్నా.. ఇప్పుడు కృతి శెట్టి.. ఈ Coincidence ను గమనించారా..?

by Anudeep

Ads

“ఊహలు గుసగుసలాడే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా. తొలి సినిమా తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయిన రాశి ఖన్నా ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఆకట్టుకునే అందం అందుకుతగ్గ నటన కలిసి ఉన్న హీరోయిన్ రాశిఖన్నా వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు..

Video Advertisement

కోవిడ్ ముందు వరకు రాశి ఖన్నా ఫామ్ లోనే ఉన్నారు. కరోనా కారణంగా సినిమా విడుదలలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. కోవిడ్ కు ముందు 2019 లో రాశి ఖన్నావి రెండు సినిమాలు విడుదల అయ్యాయి.

coincidence 1

2019 డిసెంబర్ లో ప్రతి రోజు పండగే, వెంకీ మామ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవి కేవలం వారం రోజుల తేడా తోనే విడుదల అయ్యాయి. ప్రతి రోజు పండగే సినిమాలో రాశి సాయిధరమ్ తేజ్ సరసన నటించగా.. వెంకీ మామ సినిమాలో నాగ చైతన్య సరసన నటించారు. ప్రస్తుతం ఆమె బాటలోనే మరో కుర్ర హీరోయిన్ కూడా నడుస్తోంది.

coincidence 2

ఆమె ఎవరో కాదు.. “ఉప్పెన” సినిమాతో బేబమ్మగా యువత మదిని దోచుకున్న కృతి శెట్టి. ప్రస్తుతం హీరోయిన్ కృతి శెట్టివి కూడా రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. కేవలం రెండు వారాల గ్యాప్ తోనే కృతి శెట్టివి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 24 న నాని, కృతి శెట్టి జంటగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా విడుదల అయింది. రెండు వారాల తేడాతో.. జనవరి 14 న “బంగార్రాజు” విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కృతిశెట్టి నాగచైతన్య సరసన నటిస్తోంది.


End of Article

You may also like