Home News Covid Rules : కోవిడ్ నిబంధనలు పాటించని వారిపైన కొరడా ఝుళిపిస్తున్న ఢిల్లీ సర్కార్ !

Covid Rules : కోవిడ్ నిబంధనలు పాటించని వారిపైన కొరడా ఝుళిపిస్తున్న ఢిల్లీ సర్కార్ !

by Sunku Sravan

దేశంలో కరోనా ఉదృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతుంది. ఉప్పెనలా ఎగిసిపడి ప్రపంచాన్ని, మరియు భారత దేశాన్ని అస్తవ్యస్తం చేసిన మహమ్మారి. ఇంకా అంతం అవ్వలేదు మరోవైపు మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యం లో, అటు ప్రభత్వాలు ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాస్త ఏమరపాటుగా ఉన్న మల్లి మహమ్మారి విజృంభిస్తుంది.

delhi-janpath-market

delhi-janpath-market

ఇలాంటి తరుణంలో ప్రజలు కూడా ప్రబుత్వాలకి సహకరించవల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాక్ డౌన్ ప్రక్రియ ముగించి ఆన్ లాక్ దిశగా అడుగులేస్తున్న రాష్ట్రాలు. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించవలసిన అవసరం ఉంది. ప్రభత్వాలు హెచ్చరిస్తున్న ప్రజలు పేడ చెవిన పెడుతున్నారు. అలాంటివారిపై ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కోవిడ్ నిబంధనలు పాటించని ఢిల్లీ లోని జనపథ్ మార్కెట్ పై నిషేదాజ్ఞలు విధించిన కేజ్రీవాల్ సర్కార్. ఇప్పుడు మరి కొన్ని మార్కెట్ల పైన చర్యలు చేపట్టింది.

Arvind Kejriwal

నిబంధనలు పాటించని సుల్తాన్ పూరి మార్కెట్ పై నిషేధం విధించింది. సుల్తాన్పూర్ సబ్జి మండి పై కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ప్రయోగించింది. ఈ నెల 16 వరకు ఇవి ఎలాంటి కార్యకలాపాలు నడిపే వీలు ఉండదు. దీనితో పాటుగా నిబంధలను పాటించని మరో కొన్ని మార్కెట్ల పైన కూడా చర్యలు తీసుకుంది కేజ్రీవాల్ సర్కార్. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని అధికారులు తెలిపారు.

Also Read :

అసలు హీరోయిన్ కంటే సైడ్ హీరోయిన్ కె ఎక్కువ ఫిదా అయ్యారు గా..! ఈ కామెంట్స్ చూడండి..!

RASHI PHALALU: 14 .07 .2021 రోజువారి రాశి ఫలాలు తెలుగులో, RAASI PHALALU IN TELUGU

You may also like