ఆన్ లైన్ మోసం చేసి 5 కోట్లు వెనకేసాడు.. వితంతువులు, విడాకులు తీసుకున్న అమ్మాయిలే టార్గెట్.. అసలు స్టోరీ ఏంటంటే?

ఆన్ లైన్ మోసం చేసి 5 కోట్లు వెనకేసాడు.. వితంతువులు, విడాకులు తీసుకున్న అమ్మాయిలే టార్గెట్.. అసలు స్టోరీ ఏంటంటే?

by Anudeep

Ads

సైబర్ నేరాలు జరగడం ఈ రోజుల్లో చాలా మాములు విషయం అయిపొయింది. మనం వాడే మొబైల్ లేదా, లాప్ టాప్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఆక్టివ్ గా ఉంది అంటే చాలు మన డేటా విషయంలో మనం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం నెట్టింట్లో ఉన్నాం అంటే మన డేటా పబ్లిక్ గా ఉన్నట్లే.

Video Advertisement

చాలా మంది కేటు గాళ్ళు మన డాటాను, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను హాక్ చేస్తూ మనకే వెన్నుపోటు పొడుస్తుంటారు. అడిగినంత డబ్బు సమర్పిస్తే తప్ప మన డేటా తిరిగి సేఫ్ గా వస్తుందన్న గ్యారెంటీ లేదు.

vamsi

చదువుకున్న యువత కూడా ఇలాంటి సైబర్ మోసాలల్లో ఈజీగా చిక్కుకుంటోంది. అయితే నిరుద్యోగం పెరుగుతున్న క్రమంలో కొందరు యువతీ యువకులు ఉద్యోగం వస్తుందన్న ఆశతోనో.. కష్టాలు గట్టెక్కుతాయన్న ఉద్దేశ్యంతోనే తొందరపడి ఇలాంటి కేటు గాళ్ళ వలలో చిక్కుంటున్నారు. ఆ తర్వాత లక్షల రూపాయల డబ్బుని పోగొట్టుకుని విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వంశి కృష్ణ అనే ఈ కేటుగాడు నిరుద్యోగ యువతను మోసం చేసాడు.

vamsi 1

వీరిలో ఏకంగా 500 ల మంది అమ్మాయిలే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విడాకులు తీసుకున్న అమ్మాయిలు, వితంతు మహిళలే ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఈ కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మొత్తంగా ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆన్ లైన్ లో విడాకులు తీసుకున్న మహిళలను, వితంతువులను టార్గెట్ చేసిన వంశి కృష్ణ స్కీం ల పేర్లు చెప్పి అటు ప్రజా ప్రతినిధులను సైతం మోసం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.


End of Article

You may also like