Ads
గత కొన్ని రోజుల నుంచి కూడా దీప్తి సునైనా, షణ్ముఖ్ మధ్య గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి. తరువాత వారు బ్రేక్ అప్ చెప్పుకున్నారు. ఈ టైంలో వారు పెట్టిన ట్వీట్స్ కూడా చాలానే వైరల్ అయ్యాయి. న్యూ ఇయర్ రోజే.. ఈ కొత్త జంట తమ దారులు వేరు అంటూ స్పష్టం చేసింది.
Video Advertisement
వీరిద్దరూ విడిపోయి ఇప్పటికి వారం పైనే అవుతోంది. అయినప్పటికీ వీరి అభిమానులు వీరిద్దరూ కలిసి ఉంటె బాగుంటుంది అని కోరుకుంటున్నారు.
ఇటువంటి టైములో తాజాగా దీప్తి, షన్ను కలిసి జంటగా నటించిన ‘మలుపు’ మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో దీప్తి, షన్ను షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది. ఈ వీడియోలో షన్ను హాస్పిటల్ బెడ్ పై పడుకోగా.. దీప్తి వచ్చి అతని ఎదపై పడుకుంటుంది. వెంటనే షన్ను నవ్వుతూ.. నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వాలంటూ గొడవపడుతుంది అంటూ సెటైర్ వేసాడు. వెంటనే దీప్తి కూడా నవ్వేసింది.
ఆ తరువాత షన్ను ముద్దు పెట్టుకోగా… దీప్తి అలానే చూస్తూ ఉండిపోయింది. వీరిద్దరూ ఎంతలా ప్రేమించుకున్నారో ఈ వీడియో చెప్పకనే చెప్తుంది. ఈ వీడియోను చూసి ఫాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. మీరిద్దరూ కలిసి నటించిన చివరి సాంగ్ అవుతుందని అనుకోలేదని, మీ జంట బాగుందని, మీరు మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Watch Video:
End of Article