“కార్తీకదీపం 2” సీరియల్ ని నడిపించబోయే ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరో తెలుసా..?

“కార్తీకదీపం 2” సీరియల్ ని నడిపించబోయే ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ లో నటించే నటీనటుల అందరూ దాదాపు ప్రతి తెలుగువారి కుటుంబంలో ఒక భాగమైపోయారు. హీరో, హీరోయిన్లే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ లో చాలా బాగా నటిస్తారు.

Video Advertisement

అందుకే కార్తీక దీపం సీరియల్ లో నటించే చిన్న పిల్లలకి కూడా దాదాపు హీరోహీరోయిన్లకి ఉన్నంత పాపులారిటీ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక దీపం సీరియల్ సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది.

ఎన్నో సంవత్సరాల నుండి టాప్ ప్లేస్ లోనే ఉంది. ఎంతోమంది క్యారెక్టర్స్ షో లో వచ్చారు. ఇప్పుడు సీరియల్ లో లీప్ రాబోతోంది. ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో దీప కార్తీక్ మాట్లాడుకుంటారు. తర్వాత వారిద్దరూ చనిపోయినట్టు చూపిస్తున్నారు. వారిద్దరి పక్కన శౌర్య ఫోటో కూడా ఉంది. ఇప్పుడు సీరియల్ లో పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయినట్టు చూపిస్తున్నారు. ఇంక కార్తిక్ దీప క్యారెక్టర్స్ సీరియల్ లో కనిపించే అవకాశం లేదు. అలాగే ఇప్పుడు ఉన్న మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఉండకపోవచ్చు.

చాలా కొత్త పాత్రలు పరిచయం అవుతారు. కథ కూడా కొత్తగానే ఉంటుంది. ఇద్దరు పిల్లల్లో ఒకరు డాక్టర్ ఇంకొకరు ఆటో డ్రైవర్ అయినట్టు చూపిస్తున్నారు. హిమ, సౌర్య పాత్రలలో నటించనున్న ఈ కొత్త ఆక్టర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరి పేర్లు అమూల్య గౌడ, కీర్తి భట్. కీర్తి భట్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. స్టార్ మా లో వచ్చే “మనసిచ్చి చూడు” సీరియల్ లో ఆమె నటిస్తోంది. ఇక అమూల్య ఓంకార్ గౌడ కన్నడ సీరియల్ “కమాలి” తో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ కు వచ్చి తెలుగు ఇండస్ట్రీ లో ప్రయత్నాలు చేస్తున్నారు.


End of Article

You may also like