Ads
కొన్ని విషయాలు కావాలని అనుకోకపోయినా అలా జరిగిపోతూ ఉంటాయి. అవి అనుకోకుండా జరిగినా.. ఆ విషయం మనకి తెలిసిన తరువాత అరె ఇదేంటి ఇలా జరిగింది అని సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. అలాంటి కో ఇన్సిడెన్స్ లు సినిమా ఇండస్ట్రీలో చాలానే జరుగుతూ ఉంటాయి.
Video Advertisement
నాచురల్ స్టార్ నాని, హీరో శర్వానంద్ ల మధ్య కూడా ఓ కో ఇన్సిడెన్స్ జరిగింది. అదేంటి వీళ్లిద్దరు ఏ సినిమాలోనూ కలిసి కూడా నటించలేదు కదా అని అనుకుంటున్నారా..?
మరి వీళ్లిద్దరి విషయంలో జరిగిన ఆ కో-ఇన్సిడెన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ.. అష్టా చెమ్మా సినిమాతో టాలీవుడ్ తెరకు హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. అలాగే.. ఆయన “అలా మొదలైంది” సినిమాతోనే టాలీవుడ్ నటి నిత్యామీనన్ కూడా తెరంగ్రేటం చేసింది.
చిరు తో కలిసి థమ్స్ అప్ ఆడ్ తో తొలి షూటింగ్ లో పాల్గొన్న శర్వానంద్ “5 వ తారీకు” సినిమాతో హీరో గా పరిచయం అయ్యారు. నాని, శర్వానంద్ ల విషయంలో యాదృచ్చికంగా జరిగినది ఏంటంటే.. నాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన హీరోయిన్ల రెండవ సినిమా శర్వానంద్ తోనే అవుతుంది.
ఇది అనుకునే జరిగిందో.. లేక యాదృచ్చికంగా జరిగిందో తెలియదు కానీ.. మీరు సరిగ్గా గమనిస్తే మీకు ఈ విషయం అర్ధమవుతుంది. నాని “అలా మొదలైంది” సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిత్య తన రెండవ సినిమా “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” ను శర్వానంద్ తో కలిసి చేసింది. అలాగే, నాని ” కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” సినిమాతో పరిచయమైన మెహ్రీన్ కూడా రెండవ సినిమా ” మహానుభావుడు” ని శర్వానంద్ తోనే చేసింది. మరో హీరోయిన్ ప్రియాంక మోహన్ మొదటి సినిమా “గ్యాంగ్ లీడర్” (నాని) కాగా, రెండవ సినిమా “శ్రీకారం” లో శర్వానంద్ తో కలిసి నటించింది. ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి..
End of Article