శేఖర్ కమ్ముల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఈ దర్శకుడు తీసుకు వచ్చారు. పైగా శేఖర్ కమ్ముల చిత్రాలు చాలా నేచురల్ గా ఉంటాయి. చూడడానికి ఎంతో ఆనందంగా, ఫ్రెష్ గా ఉంటాయి శేఖర్ కమ్ముల చిత్రాలు. లవ్ స్టోరీ సినిమా విజయం సాధించడంతో శేఖర్ కమ్ముల ఫుల్ ఖుష్ లో ఉన్నారు.
Video Advertisement
అలాగే, ఆయన తన తదుపరి సినిమా పనులపై బిజీ గా ఉన్నారు. లవ్ స్టోరీ సినిమా తరువాత ఆయన తమిళ నటుడు ధనుష్ తో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే.. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా అక్కినేని వారసుడు నాగ చైతన్య శేఖర్ కమ్ములతో కలిసి పని చేసారు. ఈ సినిమా నాగ చైతన్యకి మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ,మరో అక్కినేని హీరో సుమంత్ కూడా శేఖర్ కమ్ములతో ఓ సినిమా కోసం పని చేసాడు. ఆ సినిమా పేరే గోదావరి సినిమా.
ప్రస్తుతం తమిళ్ హీరో ధనుష్ కూడా శేఖర్ కమ్ములతో కలిసి పని చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు హీరోల విషయంలో ఒకటే జరిగింది. అదేంటో గమనించారా..? అదేనండి విడాకులు. లవ్ స్టోరీ సినిమా హిట్ అయ్యిందో లేదో.. నాగ చైతన్య-సమంతలు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే.. గోదావరి సినిమా కూడా 2006 లో విడుదల అయ్యింది.
అదే ఏడాది హీరో సుమంత్ కూడా తన వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పారు. ప్రస్తుతం ధనుష్ కూడా తన 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో.. శేఖర్ కమ్ములతో పని చేసిన ఈ ముగ్గురు హీరోల విషయంలో ఒకటే జరిగింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.