ఆ హీరోతో మాత్రం సినిమా వద్దు అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్.! అసలేమైంది?

ఆ హీరోతో మాత్రం సినిమా వద్దు అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్.! అసలేమైంది?

by Anudeep

Ads

ఆడపిల్లలు ఎంత పెద్దవారైనప్పటికీ ఎప్పుడూ తమ సంరక్షణలో ఉండాలని తల్లిదండ్రుల ఆశిస్తారు. ఎవరు ఏమన్నా ఇది అక్షర సత్యం. దీనికి మన స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా భిన్నం కాదు అనే వార్త రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. ఎన్నో సినిమాల దర్శకత్వం చేసి సెన్సేషనల్ హిట్స్ సాధించిన స్టార్ డైరెక్టర్ శంకర్ కు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు.

Video Advertisement

చదువు మీద ఎంతో ఆసక్తి కన్నా శంకర్ తన ఇద్దరి కూతుర్లను డాక్టర్ విద్య చదివించారు. కానీ సినిమాలో హీరోయిన్ కావాలన్న చిరకాల వాంఛ కలిగిన ఆయన పెద్ద కుమార్తె అదితి శంకర్‌ తన ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి అయిన తర్వాత తన కలను నెరవేర్చుకోవడానికి రెడీ అయ్యారు.

కానీ తన కూతురు సినీ రంగంలో ప్రవేశించడం ఏమాత్రం ఇష్టం లేని శంకర్ దీనికి అస్సలు ఒప్పుకోలేదు. ఒకవేళ హీరోయిన్గా సక్సెస్ కాలేక పోతే తిరిగి తను వైద్య వృత్తిని కొనసాగిస్తానని తండ్రికి నచ్చచెప్పి ఆమె విరుమాన్‌ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అదితి శంకర్‌ విరుమాన్‌ చిత్ర ఆడియో విడుదల వేదికపై పేర్కొన్నారు.
ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకుడు కాగా, కార్తీ ఈ చిత్రంలో హీరోగా నటించారు, కాబట్టి అదితి ఈ సినిమాలో నటించడానికి శంకర్ ఎటువంటి వ్యతిరేకత చూపలేదు.

కానీ తొలి చిత్రం సక్సెస్ కావడంతో అతిథి తర్వత కరోనా కుమార్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమాలో కథానాయకుడు శింబు అవ్వడంతో ఈ చిత్రం చేసే దానికి ఫీల్ లేదు అని శంకర్ తన కూతురుకు చెప్పినట్టు సమాచారం.
ఇప్పటికే అనేక ప్రేమ వివాదాలతో సంచలనం సృష్టించిన నటుడిగా శింబు కు పేరు ఉండటమే ఇందుకు కారణం.
ఈ క్రమంలో కరోనా కుమార్‌ చిత్రం అనేక సమస్యల వల్ల ప్రారంభం కాకముందే ఆగిపోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగిపోవడంతో డైరెక్టర్ శంకర్ టెన్షన్ ఫ్రీ అయ్యారన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


End of Article

You may also like