Ads
వీరప్పన్ 1990లలో ఎక్కువగా వినిపించిన పేరు. ‘రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా’ గా పేరుగాంచిన వీరప్పన్ భయంకరమైన బందిపోటుగా దశాబ్దాల తరబడి కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలను వణికించాడు. ఎర్ర చందనం, ఏనుగుదంతాల స్మగ్లర్ అయిన వీరప్పన్. కన్నడకంఠీర రాజ్ కుమార్, కొందరు రాజకీయ నాయకులను కిడ్నాప్ చేసి, సంచలనం సృష్టించాడు. వారిలో కొందరిని చంపాడు.
Video Advertisement
అతని కోసం తమిళనాడు పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ‘ఆపరేషన్ కుకూన్’ మొదలుపెట్టారు. 1991లో మొదలైన ఈ ఆపరేషన్ 2004 అక్టోబర్ 18న వీరప్పన్, అతని అనుచరులను కాల్చిచంపడంతో ముగిసింది. ఈ ఆపరేషన్ కోసం అప్పట్లో నే దాదాపు వంద కోట్ల ఖర్చు పెట్టడం విశేషం. తాజాగా వీరప్పన్ పై నెట్ ఫ్లిక్స్ లో ది హంట్ ఫర్ వీరప్పన్ అనే కొత్త సిరీస్ ను రిలీజ్ చేసింది. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
పోలీసులు వీరప్పన్ పట్టుకుని కాల్చి చంపిన తర్వాత, ఒక్క ప్రశ్న మిగిలిపోయింది. వీరప్పన్ ఎవరు? అతను నేరస్థుడా లేదా తిరుగుబాటుదారుడా? అని రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది హంట్ ఫర్ వీరప్పన్’. దీనిని సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ సిరీస్ 4 ఎపిసోడ్లుగా రూపొందింది. నాలుగు ఎపిసోడ్లను రెండు దశాబ్దాల పాటు సాగిన వీరప్పన్ చరిత్ర గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ది ఫారెస్ట్ కింగ్, ది బ్లడ్ బాత్, ది రివల్యూషనరీ మరియు ది వే అవుట్ అనే ఎపిసోడ్లలో వీరప్పన్ స్టోరీని వివరించారు.
ముందుగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి భయంకరమైన, అంతుచిక్కని బందిపోటుగా ముద్రపడిన వీరప్పన్ ని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఎన్నుకుంది అనే విషయాన్ని మొదటి ఎపిసోడ్ లో వివరించారు. 37 ఏళ్ల వయసులో వీరప్పన్ తనను పెళ్లి చేసుకోమని అడిగాడని ముత్తులక్ష్మి చెప్పింది. ఆ సమయంలో తనకు పద్నాలుగు లేదా పదిహేనేళ్లు, అని ఆమె గుర్తుచేసుకుంది. వీరప్పన్ వేట కార్యకలాపాలను చేస్తూ, పేదలకు సహాయం చేయడం ద్వారా మంచి పేరు సంపాదించి, నాయకుడిగా మారారు. ఆ తర్వాత చందనం స్మగ్లర్గా మారాడు.
అడ్డుగా వచ్చిన నలుగురు పోలీసు అధికారులను, అటవీ అధికారి శ్రీనివాస్ను కనికరం లేకుండా కాల్చి చంపుతాడు. రెండవ ఎపిసోడ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విసిరిన ప్రతి సవాలును వీరప్పన్ ఎలా ఎదుర్కొన్నాడో, ఎలా వెంటాడు అనే వాటిని వివరించారు. ఆ తరువాత ఎపిసోడ్లలో వీరప్పన్ కోసం మొదలుపెట్టిన ‘ఆపరేషన్ కుకూన్’ లో వీరప్పన్ కోసం జరిగిన వేటలో అతను తప్పించుకోవడం, ఆ క్రమంలో చేసిన హత్యలు, అతను స్వాధీనం చేసుకున్న అటవీ భూముల గురించి వివరిస్తారు.
సూపరింటెండెంట్ ‘రాంబో’ గోపాలకృష్ణన్ వీరప్పన్ కోసం నల్లూరు గ్రామస్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం, కర్ణాటక స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేత నల్లూరు గ్రామాన్ని కాల్చి వేయడం, కస్టడీలో చేసే హింసలు వంటి వాటి గురించి ఈ సిరీస్ ప్రస్తావించారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిని పట్టుకున్న సమయంలో పోలీసులు ఆమెపై హింసను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ డాక్యుమెంటరీకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సునాద్ వ్యాఖ్యాతగా పనిచేశారు.
వీరప్పన్ పై సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఆవిష్కృతం అయ్యాయి. వీరప్పన్ మాజీ ముఠా సభ్యులు చెప్తున్న ప్రకారం అతను అన్యాయం, అసమానతల పై పోరాటం చేశారు. పేదవారికి భారీగా డబ్బును పంచాడు. అందుకే కొందరు అతన్ని రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. భయంకరమైన నేరస్థుడైన వీరప్పన్ లో కూడా సానుకూల లక్షణాలు ఉండవచ్చు. ఆ లక్షణమే తనను కూడా రక్షించగలదా? అనే ప్రశ్నతో దర్శకుడు ఈ సిరీస్ కు ముగింపును పలికారు.
Also Read: స్వతంత్రం రాకముందు పరిస్థితులు ఇలా ఉండేవా..? ఈ సినిమా చూశారా..?
End of Article