అక్కడ వాక్సిన్ వేయించుకోకపోతే ఇళ్లకు కరెంటు కట్ చేస్తారట.. ఇండియాలోనే.. ఎక్కడంటే..?

అక్కడ వాక్సిన్ వేయించుకోకపోతే ఇళ్లకు కరెంటు కట్ చేస్తారట.. ఇండియాలోనే.. ఎక్కడంటే..?

by Anudeep

Ads

ప్రస్తుతం దేశం లో పలు చోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరు గా సాగుతోంది. కొన్ని చోట్ల వాక్సిన్ లు అందుబాటులో లేవు.. మరికొన్ని చోట్ల ప్రజలకోసం వాక్సిన్ లు ఏర్పాటు చేసినా.. వారు వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనితో.. రాష్ట్ర ప్రభుత్వాల్లో నయానో భయానో వారికి వాక్సిన్ ను వేయించే పనికి పులుముకున్నాయి. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా వాక్సిన్ వేయించుకున్న వారికి బహుమతులు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Video Advertisement

vaccination

నార్త్ కి చెందిన మరో రాష్ట్రము లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం గా ఉంది. యూపిలోని కన్నౌజ్ వద్ద ప్రజలు టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీనితో అదనపు కలెక్టర్ రంగం లోకి దిగి.. టీకా వేయించుకోకపోతే వారి ఇళ్లకు కరెంటు కట్ చేస్తామంటూ చెప్పారు. దీనితో అక్కడి ప్రజలు వాక్సిన్ వేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. మరో వైపు ఈ విషయం వైరల్ అవడంతో ఆయన అలా అనలేదని చెప్పారు. కేవలం కరెంటు బిల్ కట్టనివారికి మాత్రమే కరెంటు కట్ చేస్తున్నామని చెప్పారు. అయితే.. ఏది ఐతే అది అయిందని చాలామంది వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చారు.


End of Article

You may also like