Ads
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు దేశమంతా అభిమానులు ఉన్నారని రుజువైంది. తాజాగా ఓ అభిమాని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు సూసైడ్ నోట్ పంపాడు.
ఇంతకీ సదరు అభిమాని ఇలా ఎందుకు సూసైడ్ నోట్ పంపాడో తెలుసా?
Video Advertisement
ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి రిలీజ్ కి సిద్ధం అవుతున్నా.. ఈ సినిమా నుంచి ఎటువంటి అప్ డేట్స్ రావడం లేదు. దీనితో సదరు అభిమాని హర్ట్ అయ్యి లెటర్ పంపాడు.
తాను ఇప్పటివరకు ఎలాంటి లేఖ రాయలేదని, సూసైడ్ లెటర్ ను ఇలా రాస్తానని ఎప్పుడు అనుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నాడు. అప్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరుగుతోందని.. ఇప్పటివరకు చాలా రోజులు ఎదురు చూశామని.. నా చావుతో అయినా అప్ డేట్స్ ఇస్తారని భావిస్తున్నా అని లేఖలో రాసాడు. తన చావుకి కారణం యువి క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమేనని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
End of Article