RK BEACH FLOATING BRIDGE: పెట్టిన మరుసటి రోజునే ఊడిపోయింది అని ట్రోల్ చేసారు.. కానీ ఇది అసలు కథ..!

RK BEACH FLOATING BRIDGE: పెట్టిన మరుసటి రోజునే ఊడిపోయింది అని ట్రోల్ చేసారు.. కానీ ఇది అసలు కథ..!

by kavitha

Ads

విశాఖ ఆర్కే బీచ్‌లో ఆదివారం అట్టహాసంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించిన విషయం తెలిసిందే.  అయితే రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి భాగం విడిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పింది అంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ప్రారంభించిన రెండవ రోజే ఇలా జరగటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Video Advertisement

ఆర్కే బీచ్‌ సందర్శకులు కూడా ఈ సంఘటన పై మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శల పై ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్వాహకుడు తాజాగా స్పందిస్తూ,  మీడియాలో, సామాజిక మధ్యమాలలో వస్తున్న ప్రచారాలను ఖండించారు. ఈ ఘటన పై వివరణ ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

విశాఖపట్నం సాగర తీరంలో విశాఖ మెట్రోపాలిటన్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి  ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ ఆదివారం నాడు మినిస్టర్ గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని దాదాపు కోటీ 60 లక్షల రూపాయల వ్యయంతో వీఎంఆర్‌డీఏ నిర్మించారు. జనవరి తొలి వారంలో  పనులు మొదలుపెట్టి, వేగంగా పూర్తి చేశారు.

సోమవారం నాడు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. అయితే వారిని ఫ్లోటింగ్ బ్రిడ్జి వద్దకు  అనుమతించలేదు. దాంతో చాలామంది అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. సముద్రతీరం నుంచి 100 మీటర్లు లోపల గల ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ ఆఖరి ఫ్లాట్‌ ఫామ్‌ మొదలుపెట్టిన రెండో రోజే తెగిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఆఖరి ఫ్లాట్‌పామ్‌ను తీసుకువచ్చి అతికించడానికి టెక్నికల్‌ యూనిట్, గజ ఈతగాళ్లు చాలా శ్రమించారనీ,  సందర్శకులు ఒకవేళ అక్కడ ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని పలువురు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.

ఈ క్రమంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్వాహకుడు స్పందించాడు. ” ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోలేదని, స్టాండర్స్ కమిషనర్ ఆదేశాల మేరకు చేస్తున్నాము. హై టైడ్ (సముద్ర ప్రవాహాలు తీవ్రంగా) వచ్చినపుడు,  లోటైడ్  వచ్చినపుడు, సైక్లోన్ వచ్చినపుడు డ్రిల్ చేయమని చెప్పారు. సాధారణ మాక్ డ్రిల్ల్స్ లో భాగంగానే ఆఖరి ఫ్లాట్‌ ఫామ్‌ ను విడదీసి వేరు చేశాం. ఇది సాధారణ సాంకేతిక పరిశీలనలో భాగంగా చేసిందే అని చెప్పారు. అవసరమైతే భవిష్యత్తులో కూడా ఇలాంటి మాక్ డ్రిల్ల్స్ ను చేపడతామని” వెల్లడించారు.

Also Read: మృతి చెందడానికి ముందు పన్నెండళ్ళ బాలికను కాపాడిన ఎమ్మెల్యే లాస్య నందిత.. ఏం జరిగిందంటే..?

 

 


End of Article

You may also like