“గీతాంజలి” హీరోయిన్ గుర్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

“గీతాంజలి” హీరోయిన్ గుర్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

by Anudeep

Ads

“గీతాంజలి”  ఎప్పుడో ముఫ్పై ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అయినా ఇప్పటికి ప్రేక్షకులకు ఆ సినిమా అంటే ప్రత్యేక అభిమానం..మూసధోరణిలో పోకుండా భిన్న కథల్ని పాత్రల్ని ఎంచుకుంటూ  శివ,  గీతాంజలి, అన్నమయ్య లాంటి చిత్రాలతో ట్రెండ్ సెట్ చేశారునాగార్జున. మణిరత్నం దర్శకత్వం,  మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కాంబోలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ గీతాంజలి నాగార్జున ని “మన్మధుడి”ని చేసింది.. మరి నాగార్జున సరసన నటించిన ఆ హీరోయిన్ ఏమైపోయింది.. ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తోంది..

Video Advertisement

గీతాంజలి సినిమాలో  టైటిల్ పాత్ర పోషించిన నటి పేరు గిరిజ .. గీతాంజలి సినిమాలో కళ్లతోనే హావభావాలు పలికించిన గిరిజ అసలు పేరు కూడా చాలా మందికి తెలీదు..కేవలం గీతాంజలి హీరోయిన్ గానే ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్నారు. గిరిజ పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెత్తార్..తండ్రి కర్ణాటకకి చెందిన వైధ్యుడు , తల్లి ఇంగ్లాండ్ వాసి..ఇంగ్లాండ్లో పుట్టి పెరిగిన గిరిజ తన పద్దెనిమిదవ ఏట దక్షిణ భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడానికి ఇండియాకి వచ్చింది.

గీతాంజలిలో ఆఫర్ ఎలా వచ్చిందంటే??
క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి గిరిజ అటెండ్ అయింది. ఆ పెళ్లిలో గిరిజని చూసిన మణిరత్నం తన సినిమాలో యాక్ట్ చేయాల్సిందిగా కోరారు, తర్వాత రెండు నెలల పాటు నటనలో శిక్షణ ఇప్పించి అప్పుడు గీతాంజలి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ చిత్రంలో  నాగార్జున మనసు మాత్రమే కాదు, ఆ చిత్రంలో తన నటనతో, అల్లరితో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.. ఆ చిత్రం తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటించిన గుర్తింపు రాలేదు..

అమీర్ ఖాన్ తో సినిమా ఛాన్స్ మిస్…

అమీర్ ఖాన్ , అయేషా జుల్కా జంటగా నటించిన జో జీతా వోహీ సికందర్ మూవీలో ముందుగా కథానాయిక పాత్రకి గిరిజనే ఎంపిక చేశారు..కాని తర్వాత అయేషా జుల్కాని తీసుకున్నారు.. ఆ చిత్రంలో ఒక పాటలో గిరిజ అమీర్ ఖాన్ తో నటించారు. ఆ సినిమా తర్వాత గిరిజ తిరిగి లండన్ కి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఏం చేస్తున్నారు..

గిరిజ ప్రస్తుతము రచయితగా లండన్లో స్థిరపడింది. ఈమె నటనపై ఇప్పటికీ తన అధ్యయనము కొనసాగిస్తూ ఇతర నటులు, సినీ నిర్మాతలతో పనిచేస్తూనే ఉంది. 2005 నుండి లండన్ లో ఆరోగ్య సంబంధ విషయాల జర్నలిస్ట్ గా పనిచేస్తున్నది.

మే 19,1989లో రిలీజైన గీతాంజలి చిత్రం ఇప్పటికి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది..ఈ సంధర్బంగా అప్పటి చిత్ర పోస్టర్లను వాటిని ట్వీట్ చేయడంతో అనూహ్యంగా గిరిజ మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారిపోయింది..ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గిరిజను చూసిన సినిమా ప్రేమికులు తనని చూసి ఆశ్చర్యపోతున్నారు.కొందరు నటనే ప్రాణంగా సినిమాలే ప్రపంచంగా బతికేస్తూ సినిమాల్లోకి వస్తారు. అలాంటి వారు అందరికి గుర్తుంటారని చెప్పలేం..మరికొందరు చేసింది ఒకే సినిమా అయినా గుర్తుండిపోతారు..అలాంటి వారిలో గిరిజ ఒకరు..


End of Article

You may also like