ఫుడ్ డొనేట్ చేసేవారు మార్కెట్ కంటే తక్కువ ధరకి డైరెక్ట్ FCI నుండి పొందాలంటే ఇలా చేయండి !

ఫుడ్ డొనేట్ చేసేవారు మార్కెట్ కంటే తక్కువ ధరకి డైరెక్ట్ FCI నుండి పొందాలంటే ఇలా చేయండి !

by Anudeep

Ads

ప్రపంచ దేశాలన్ని కోవిడ్ -19పై  పోరాటం చేస్తున్నాయి.. వ్యాప్తి చెందకుండా ఉండడానికి లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి.. పనులు లేని వారు, ఏ పూటకి ఆ పూట పనులు చేసుకుని బతికేవాళ్లు, వలస కార్మికులు, చిరు వ్యాపారులు ఇలా అందరి జీవితాలు చిన్నాబిన్నం అయ్యాయి.ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో కొన్ని ఎన్జీవోలు, కొంతమంది దాతలు ఆపదలో ఉన్న వారికి సాయం చేయడానికి ముందుకొస్తున్నారు..అటువంటి వారికి సాయం చేయడానికి ముందుకొచ్చింది FCI ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.

Video Advertisement

ఆహారేతర ధాన్యాలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నుండి నేరుగా కొనుగోలు చేయడానికి  ప్రభుత్వేతర సంస్థలకు కూడా అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో వేలాది మంది పేదలు మరియు పేద ప్రజలకు వండిన ఆహారాన్ని అందించడంలో ఎన్జీఓలు మరియు స్వచ్ఛంద సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంస్థలకు నిరంతరాయంగా ఆహార ధాన్యం సరఫరా అయ్యేలా చూడడానికి, ఇ-వేలం ప్రక్రియకు వెళ్లకుండా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS) రేట్లకు ఇటువంటి సంస్థలకు గోధుమలు, బియ్యం అందించాలని ఎఫ్‌సిఐని ఆదేశించింది ప్రభుత్వం.

అంతకుముందు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రోలర్ ఫ్లోర్ మిల్స్ వంటి రిజిస్టర్డ్ బల్క్ యూజర్లు మాత్రమే OMSS రేట్ల క్రింద FCI నుండి స్టాక్ కొనుగోలు చేయడానికి వీలుండేది. ఈ సంస్థలు ముందుగా నిర్ణయించిన రిజర్వ్ ధరలకు ఎఫ్‌సిఐ నుండి ఒకేసారి 1 నుండి 10 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేది..కానీ ఇప్పుడు  ఫుడ్ కార్పొరేష‌న్ గోడౌన్ల‌నుంచి స‌బ్సిడీ రేట్ల‌కు బియ్యం, గోధుమ‌ల‌ను కొనుగోలు చేసి ఆయా ఎన్జీవోల ద్వారా ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయించాలని నిర్ణయించింది.

ఆక్ష‌య పాత్ర‌, రామ కృష్ణ మిషన్‌, టాటా ట్ర‌స్టులు, ఇంట‌ర్నేష‌న‌ల్ రెడ్ క్రాస్ సెంట‌ర్, ప్ర‌ధాన్‌, ప్ర‌యాస్, హెల్పేజ్ ఇండియా, సేవా, సుల‌భ్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, ఛారిటీసీ ఎయిడ్ ఫౌండేష‌న్ ఆఫ్ ఇండియా, గౌడియా మ‌ఠ్‌, బ‌చ‌పన్ బ‌చావో ఆందోళన్‌, ది సాల్వేష‌న్ ఆర్మీ, కాథోలిక్ బిష‌ప్స్ కాన్ఫ‌రెన్స్ ఆఫ్ ఇండియా …ఇలా అనేక సంస్థ‌లు ఈ విపత్తు సమయంలో  అవసరం ఉన్నవారకి ఆపన్న హస్తం అందిస్తూ, ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

మరోవైపు క‌మ్యూనిటీ కిచెన్ల‌ను ఏర్పాటు చేసి వ‌ల‌స కార్మికుల ఆక‌లిని తీరుస్తున్నాయి. అంతే కాదు పారిశుద్ధ్యం, సామాజిక దూరం త‌దితర విష‌యాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచుతున్నాయి. శానిటైజ‌ర్లు, స‌బ్బులు, మాస్కులు, గ్లోవ్స్ త‌దిత‌ర వ‌స్తువుల‌ను విస్తృతంగా ఆరోగ్య‌రంగ కార్య‌క‌ర్త‌ల‌కు, స్వ‌చ్ఛంద సేవా కార్య‌క‌ర్త‌ల‌కు పంచుతున్నారు. ఆరోగ్య శిబిరాల‌ను ఏర్పాటు చేయ‌డంలో ప్ర‌భుత్వానికి సాయం చేస్తున్నాయి. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ఈ స్వ‌చ్ఛంద సంస్థ‌ల సేవ‌ల‌ను విరివిగా వాడుకోవ‌డం జరుగుతోంది.

అందువలన దేశంలో 2000 కి పైగా గోడౌన్ల నెట్‌వర్క్ ఉన్న FCI ఈ సంక్షోభంలో ఈ సంస్థలకు ఆహార ధాన్యాలు సజావుగా సరఫరా చేసేలా చేస్తుంది. దేశంలోని పేద మరియు వలస కార్మికులకు ఆహారం అందించే వారి పనిలో సహాయ శిబిరాలకు ఈ విధంగా ప్రభుత్వ ధరకే ధాన్యాలను అమ్మడం ద్వారా సహాయపడుతుంది. అటువంటి సంస్థలు ఆహార ధాన్యాన్ని  వివరాలను సంబంధిత జిల్లా న్యాయాధికారులకు తెలియజేసి, ఆహార ధాన్యాలను పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


End of Article

You may also like