జితేంద్రతో డ్రీమ్ గర్ల్ పెళ్లి ఎలా తప్పిపోయింది…? ఆ వార్త రాకపోయి ఉంటే..!

జితేంద్రతో డ్రీమ్ గర్ల్ పెళ్లి ఎలా తప్పిపోయింది…? ఆ వార్త రాకపోయి ఉంటే..!

by Anudeep

Ads

సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ సహజం.. పెళ్లి పీటలెక్కిన ప్రేమలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి . మన తెలుగు ఇండస్ట్రీకి వస్తే నాగ్ – అమల, చై-సామ్, మహేశ్ బాబు- నమ్రత ఇలా కొద్దిమంది మాత్రమే ప్రేమజంటలు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు. బాలివుడ్లో అలాంటి జంట అనుకోగానే మనకి గుర్తొచ్చేది ధర్మేంద్ర – హేమామాలిని . డ్రీమ్ గర్ల్ హేమామాలిని , ధర్మేంద్రకి అంత ఈజిగా ఏం సొంతమవలేదు.దాని వెనుక ఒక ఇంట్రస్టింగ్ కథ ఉంది అదేంటో చదవండి.

Video Advertisement

హేమామాలిని డ్రీమ్ గర్ల్ గా యావత్  భారత దేశం యువత మనసుల్ని కొల్లగొట్టింది. డెబ్బై పడిలోకి అడుగుపెట్టినప్పటికి ఆమె క్రేజ్ తగ్గలేదంటే ఇటీవల ఒక మినిస్టర్ ఆమె బుగ్గల గురించి చేసిన కామెంట్సే ఉదాహరణ.అలాంటి అందగత్తె మనసు దోచుకోవాలని , మనువాడాలని ఎవరు కోరుకోరు . అయితే హేమామాలిని మాంచి ఫామ్ లో ఉన్నప్పుడే ధర్మేంద్రతో ప్రేమలో పడింది..కాని ధర్మేంద్ర కి అప్పటికే పెళ్లై పిల్లలున్నారు. బాలివుడ్ నటులు సన్నిడియోల్, బాబి డియోల్ ధర్మేంద్ర,మొదటి భార్య పిల్లలే.

హేమామాలిని  , ధర్మేంద్రతో సన్నిహితంగా ఉండడం హేమా పేరెంట్స్ కి ఇష్టం లేదు. ఎలా అయినా ఆ ప్రేమని మరిపించి, హేమకి మరో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి కొడుకు ఎవరో కాదు తను కూడా ఫామ్ లో ఉన్న హీరో జితేంద్ర . అప్పటికే తను తన చిన్ననాటి స్నేహితురాలు శోభాకపూర్ తో ప్రేమలో ఉన్నప్పటికి , హేమ పేరెంట్స్ అడగ్గానే మారు మాట్లాడకుండా సరే అనేశాడు. ఎందుకనడు అవతల ఉన్నది హేమామాలిని కదా.

హేమామాలిని  బాలివుడ్ హీరోయిన్ అయినప్పటికి తన మూలాలు ఉన్నది చైన్నైలో..దాంతో చెన్నైలో సాంప్రదాయ పద్దతిలో పెళ్లి జరిపించాలని ఫిక్సయి, గుట్టుచప్పుడు కాకుండా మరీ ముఖ్యంగా ధర్మేంద్ర కి తెలియకుండా పెళ్లి చేయాలని ఫిక్సయ్యారు. ఇష్టం లేకపోయినా హేమ కూడా బలవంతంగా పెళ్లికి అంగీకరించింది. అయితే ఈ పెళ్లి విషయం తెలిసిన ఒక జర్నలిస్ట్ పేపర్లో పెద్ద హెడ్డింగ్ తో వార్త రాసి పడేశాడు. అది కాస్తా ధర్మేంద్ర కంట పడింది.

ఇంకేముంది  చైన్నై ఫ్లైట్ ఎక్కాడు , తనతో పాటు జితేంద్ర ప్రేమికురాలు శోభను కూడా తీసుకుని చెన్నైకి బయల్దేరాడు. సరాసరి హేమ ఉన్న దగ్గరికి వెళ్లాడు . హేమ పేరెంట్స్ ముందు తనని హేమతో మాట్లాడడానికి నిరాకరించారు. అయినా ధర్మేంద్ర పట్టువిడవలేదు. హేమ ఉన్న రూంలోకి వెళ్లి బతిమిలాడాడు . ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, భార్యగా స్థానమిస్తానని అనేక రకాలుగా చెప్పాడు. హేమ ఒప్పుకుంది .

మరోవైపు శోభాకపూర్ జితేంద్రకి తిట్ల అక్షింతలు వేసింది. దాంతో జితేంద్ర కూడా శోభని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.  ఆ రెండు జంటల పెళ్లిళ్లు అయ్యాయి. హేమ-ధర్మేంధ్ర లకి ఈషా డియోల్, అహనా డియోల్ అని ఇద్దరమ్మాయి.. ఈషా డియోల్ యువ సినిమాలో సూర్య సరసన నటించిన నటి. అహానా క్లాసికల్ డ్యాన్సర్ గా సెటిల్ అయింది. శోభా – జితేంద్రలకు ఇద్దరు పిల్లలు వారిలో ఒకరు ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, నటుడు తుషార్ కపూర్.

ఇదండి హేమా- ధర్మేంద్రల పెళ్లి కథ . జితేంద్రతో హేమ పెళ్లి ఎలా తప్పిపోయిందనే కథ..ఇదంతా హేమామాలిని ఆత్మకథ “హేమామాలిని – బియాండ్ ది డ్రీమ్ గర్ల్ ” లో హేమమాలిని స్వయంగా రాసుకున్నది..


End of Article

You may also like