‘జై శ్రీరాం’ అంటూ ఆ అబ్బాయిలు.. ‘అల్లాహో అక్బర్’ అంటూ ఆ అమ్మాయి.. అసలు ఏమి జరుగుతోందంటే..?

‘జై శ్రీరాం’ అంటూ ఆ అబ్బాయిలు.. ‘అల్లాహో అక్బర్’ అంటూ ఆ అమ్మాయి.. అసలు ఏమి జరుగుతోందంటే..?

by Anudeep

Ads

కర్ణాటక రాష్ట్రంలో హిజబ్ కలకలం రేపుతోంది. కళాశాలల్లో ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి రావడం వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ఉడిపి జిల్లా కుందాపూర్ ప్రభుత్వ కాలేజీకు చెందిన ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించి కాలేజీకి రావడాన్ని పాఠశాల యాజమాన్యం వ్యతిరేకించింది.

Video Advertisement

తెలుగు వన్ కధనం ప్రకారం.. కళాశాలకు డ్రెస్ కోడ్ ఉందని.. ఆ డ్రెస్ కోడ్ ని ధరించే కాలేజీకి రావాలని ప్రిన్సిపల్ ప్రకటన చేసారు. అయితే ముస్లిం అమ్మాయిలు ఈ విషయాన్నీ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. తమ విశ్వాసం గురించి ప్రిన్సిపల్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు.

hizab 1

ఈ క్రమంలో ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి వస్తుండడంతో హిందూ అబ్బాయిలు కాషాయం ఖండువా ధరించి రావడం మొదలు పెట్టారు. దీనితో.. ఇది రెండు మతాలకు చెందిన ఇష్యూ గా తయారైంది. గత కొన్ని రోజుల ముందు నుంచి ముస్లిం అమ్మాయిలు కాలేజీ కాంపౌండ్ ముందు నిరసన తెలుపుతూ ఉన్నారు. మరోవైపు హిందూ అబ్బాయిలు కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. వీరికి కొందరు అమ్మాయిలు కూడా కలిసి నిరసన తెలపడం మొదలుపెట్టారు.

hizab 2

ఇది ఇలా ఉంటె.. హిజబ్ ధరించడానికి రాజ్యాంగం మద్దతు కల్పించిందని, దానిని గౌరవించాలని జైభీమ్ విద్యార్థులు కూడా నీలం కండువా కప్పుకుని నిరసన తెలియచేస్తున్నారు. ఇలా మూడు వైపులా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గుంపులో ఇద్దరు అనుమానాస్పద యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. మొత్తం ఐదుగురిని గుర్తించగా.. ముగ్గురు పారిపోయారని, మరో ఇద్దరినీ మాత్రం అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

hizab 3

అరెస్ట్ అయిన వారిని హాజీ అబ్దుల్ మజీద్, రజాబ్ గా గుర్తించారు. వీరివద్ద ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి. కత్తితో పాటుగా, ఇతర ఆయుధాలు ఉన్నాయి. అన్నిటికంటే లిథాల్ మారణాయుధాలు దొరకడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లిథాల్ వాయు లేదా ద్రవరూపంలో ఉంటుంది. ఇది తినేవాటిల్లో కలిపి ఇస్తే.. అది స్లో పాయిజన్ గా మారి తీసుకున్నవారిని కొన్నిరోజుల్లోనే చంపేస్తుంది. అసలు వీరు ఆ గుంపులో ఎందుకు ఉన్నారు..? అన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

 


End of Article

You may also like