నాగ చైతన్య, శోభిత ఎక్కడ కలిశారు..? అసలు వారిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది..?

నాగ చైతన్య, శోభిత ఎక్కడ కలిశారు..? అసలు వారిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది..?

by Anudeep

Ads

టాలీవుడ్ లో సెలెబ్రిటీ జంటగా ఉన్న సమంత, నాగ చైతన్య గత సంవత్సరం విడాకులు తీసుకొని అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. విడాకుల అనంతరం ఇద్దరు సినిమాల్లో బిజీ అయిపోయారు.

Video Advertisement

ఇటీవల కె.ఆర్. కె తమిళ సినిమాతో పాటు, సామ్ పుష్పలో ఓ ప్రత్యేక పాటలో నృత్యంతో అలరించింది. అలాగే చైతూ కూడా వరుస సినిమాలతో బిజీ గా ఉంటూ, వరుస హిట్లను ఎంజాయ్ చేసున్నాడు. సాయి పల్లవి, చైతూ జంటగా నటించిన లవ్ స్టోరీ మంచి విజయం సాధించగా, సంక్రాంతికి బంగార్రాజు తో మెప్పించాడు.

ఇప్పుడు థాంక్యూ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.  చైతన్య, శోభితలకు ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడని ఆ వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో చైతన్య శోభిత కలిశారని సమాచారం. ఆ పరిచయం స్నేహంగా మారిందని తెలుస్తోంది. శోభిత ఇటీవల విడుదలైన మేజర్ సినిమాలో నటించింది. సమంత కూడా వీరి జంటను టార్గెట్ చేసి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అయితే చైతన్య శోభితలకు పరిచయం ఉన్నమాట వాస్తవమే అని ఆ పరిచయం ప్రేమగా మారిందని జరుగుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదని తెలుస్తోంది. శోభితా కూడా ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇవన్నీ పుకార్లు, అలాగే ఇలాంటి పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదు అని అర్థం వచ్చేలాగా స్పందించారు. వైరల్ అవుతున్న ఈ రూమర్స్ గురించి త్వరలో నాగ చైతన్య స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జులై22న థాంక్యూ సినిమా విడుదల సందర్భంగా చైతూ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. ఈ ప్రమోషన్స్ లో తన గురించి వైరల్ అవుతున్న రూమర్లకు సంబంధించి చైతన్య తప్పక స్పందిస్తారని సమాచారం. ఇటీవల సినిమాల విషయంలో చైతూ ఎంతో జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటున్నట్టూ తెలుస్తుంది. కొత్త డైరెక్టర్స్ కి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.


End of Article

You may also like