Ads
భార్య భర్తల సంబంధాలు చాలా సున్నితమైనవి. రెండు చేతులతో చప్పట్లన్నట్లు.. ఇద్దరు కలిసి బాలన్స్ చేసుకోకపోతే అనర్ధాలు సంభవిస్తాయి. అలాంటి బంధం లోకి మూడవ వ్యక్తిని రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే, అనర్ధాలు చోటు చేసుకుంటాయనడానికి ఉదాహరణే ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ. హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీ కి చెందిన జంట ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు.
Video Advertisement
representative image
ఇటీవలి కాలం లో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీనగర్ కాలనీ లో నివాసం ఉంటున్న భర్త వివేక్ వీరేంద్ర సింగ్ అనే భర్త కు కూడా ఓ అమ్మాయి తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమ గా మారింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ మహిళా ఇతన్ని పోరు పెట్టడం మొదలుపెట్టింది. దీనితో, ఆ వ్యక్తి తన భార్య కు విడాకులు ఇవ్వాలని భావించాడు. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ, ఆ భార్య మాత్రం విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీనితో, భర్త తన ప్రేయసి తో కలిసి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
represetantive image
ఆ తరువాత నుంచి భర్త మరింత టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. తన భార్య ఎక్కడకు వెళ్లిన తెలిసేలా ఓ ఇద్దరు వ్యక్తుల్ని నియమించాడు. వారు ఆమె ను ఫాలో అయ్యేవారు. ఓ రోజు అనుమానం వచ్చి ఆ భార్య తన స్కూటీ లో చెక్ చేస్తే.. అందులో ఓ ట్రాకర్ కనిపించింది. దీని ద్వారా ఆమె ఎక్కడకు వెళ్లినా.. ఆమె భర్త కు ఆ ఇద్దరు ఫాలో అవుతున్న వ్యక్తులకు తెలిసిపోతోంది. ఈ విషయం తెలియగానే ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేరొక మహిళతో అక్రమం సంబంధం పెట్టుకోవడం తో పాటు.. కట్టుకున్న భార్యను కూడా వేధించడం తో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి వారిని కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
End of Article