అందం గా ఉందని పెళ్లి చేసుకున్నాడు.. ఆ అందమే ఆమె పాలిట శాపమైంది… అసలేమైందంటే..?

అందం గా ఉందని పెళ్లి చేసుకున్నాడు.. ఆ అందమే ఆమె పాలిట శాపమైంది… అసలేమైందంటే..?

by Anudeep

Ads

అందం గా ఉండడం అదృష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఆ అందమే ఆమె పాలిట శాపమైంది. ఈ ఘటన హైదరాబాదు వనస్థలి పురం లో చోటు చేసుకుంది. వనస్థలీపురానికి చెందిన భర్త తన భార్య కవితను ఎంతో అందం గా ఉందని మురిసిపోయేవాడు. చివరకు, ఆ మురిపెం అనుమానానికి దారితీసింది. ఆమెను హత్య చేసి.. కరోనా తో చనిపోయిందంటూ నమ్మబలికాడు.

Video Advertisement

vanasthalipuram incident

అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఓ వారం రోజులకు కవిత తల్లితండ్రులకు అనుమానం వచ్చింది. ఇంత దగ్గరగా అంత్యక్రియలలో పాల్గొన్నా ఎవరికీ పాజిటివ్ రాకపోవడం తో వారి అనుమానం బలపడింది.ఆ తరువాత ఆసుపత్రిలో ఎంక్వైరీ చేయగా కవితకు కరోనా నెగటివ్ వచ్చినట్లు తేలింది. దీనితో అల్లుడు విజయ్ తమ కూతురుని హత్య చేసి ఉంటాడని ఆ తల్లితండ్రులు భావించారు.

vanasthalipuram incident

వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కవితను చంపేసి.. కరోనా తో మృతి చెందినట్లు కథ అల్లాడని వివరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కవిత స్వగ్రామం అయిన పిల్లిగుంట్ల తండా లోనే అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ పాతిపెట్టిన కవిత శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. పోస్టుమార్టమ్ లో కవితకు కరోనా సోకలేదని తేలింది.

man arrested

కవిత ఊపిరాడకే చనిపోయిందని తేలింది. ఆమె మెడపై కూడా గాయాలున్నాయని తేలింది. దీనితో పోలీసులు విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారణ సాగించారు. అతను భర్యను దిండు తో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టు కు తీసుకెళ్లి రిమాండ్ తీసుకున్నారు.

 


End of Article

You may also like