Ads
బిగ్ బాస్ ఓటిటిలో కూడా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వెర్షన్ రీసెంట్ గానే మొదలయింది. 11 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు మిత్ర శర్మ. ఇప్పుడు ఈమె గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఫుల్ డ్రామాతో అలరిస్తా అంటూ చెప్పి అందరిని తన వైపు తిప్పేసుకుంది.
Video Advertisement
ఇక హౌస్ లోకి వెళ్ళగానే.. ఆర్జే చైతూని ఆమె అన్న అని పిలిచి మరోసారి షాక్ కి గురి చేసింది. ఎందుకు ఇలా అన్న అంటున్నారు అని చైతు అడిగితే.. అది అంతే అంటూ సమాధానం ఇవ్వడం కూడా హైలైట్ అయింది.
1993 వ సంవత్సరం మే 24 న ముంబైలో పుట్టిన మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద. ఈమె ముంబైలోనే పెరిగారు. తండ్రి సలహా సూచనలతోనే ఆమె నటనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. అయితే.. తండ్రి చనిపోవడంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు బంధువులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది.
హైదరాబాద్ కి వచ్చాక అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలని భరించింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించి అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. “తొలి సంధ్య వేళలో” అనే సినిమాలో ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత ఓ రెండు సినిమాల్లో కూడా నటించారు కానీ అవి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. నార్త్ అమ్మాయే అయినా.. మిత్రా తెలుగు బాగా మాట్లాడతారు. “‘శ్రీపిక్చర్స్” అనే నిర్మాణ సంస్థని కూడా స్థాపించి.. “బాయ్స్” అనే బోల్డ్ సినిమాని సొంతంగా నిర్మించారు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు కూడా ఇటీవల హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తాను అవకాశాల కోసం తిరగడం కాదు.. తానె నలుగురికి అవకాశం ఇవ్వాలి అనేదే ఆమె మోటో.. ఆ పాలసీ తోనే ఆమె ముందడుగు వేస్తున్నారు. “బాయ్స్” సినిమాలో మిత్రా కూడా హీరోయిన్ గా నటించింది. గ్లామర్ , పెర్ఫార్మన్స్ విషయంలో తగ్గేదే లేదని నిరూపించింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం సన్నిలియోన్ నే సంప్రదించింది. సినిమాలే కాదు.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామర్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ అలరిస్తుంటుంది.
End of Article