“దేవి నాగవల్లి” అంటే టీవీ 9 యాంకర్ అని మాత్రమే అందరికి తెలుసు…కానీ ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

“దేవి నాగవల్లి” అంటే టీవీ 9 యాంకర్ అని మాత్రమే అందరికి తెలుసు…కానీ ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

by Mohana Priya

Ads

దేవి నాగవల్లి మనందరికీ టీవీ9 రిపోర్టర్ గా మాత్రమే తెలుసు. దాడి జరిగిన ప్రదేశం అయినా, లేదా ఇంకెక్కడికైనా సరే ధైర్యంగా వెళ్లి న్యూస్ ప్రజెంట్ చేయగలరు, ఎదురుగా ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా కూడా ఎటువంటి భయం లేకుండా మాట్లాడగలరు.

Video Advertisement

మనకి దేవి నాగవల్లి గురించి తెలిసింది ఇది మాత్రమే. కానీ బిగ్ బాస్ ఇంట్రడక్షన్ లో తన వ్యక్తిగత జీవితం లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి మాస్ కమ్యూనికేషన్ లో డిప్లమో చేశారు. టీవీ9 తో తన కెరీర్ ని మొదలు పెట్టారు. వృత్తి లో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశారు, అలాగే టెర్రర్ ఎటాక్ తర్వాత అమర్ నాథ్ వెళ్లి అక్కడి నుండి న్యూస్ రిపోర్టింగ్ చేశారు.

దేవి నాగవల్లి ది అరేంజ్డ్ మ్యారేజ్ అని, తర్వాత యూఎస్ఏ కి వెళ్లారని, కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లైన కొంతకాలానికి మ్యూచువల్ డివోర్స్ తీసుకొని విడిపోయారని, ఇప్పుడు తనకి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు అని, నెల తిరిగే సరికి జీతం డబ్బులు అయిపోతాయి అని, ఇంటి లోన్, ఇంకా మిగతా వాటిని కట్టడానికి కష్టంగా ఉండటంతో బిగ్ బాస్ ప్రైజ్ మనీ కోసం తను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పారు దేవి నాగవల్లి. 2009 లో నేషనల్ టెలివిజన్ అవార్డ్ (ఢిల్లీ) ని గెలుచుకున్నారు. 2009 లో, 2010 లో వరసగా నంది అవార్డులను గెలుచుకున్నారు. నేషనల్ టెలివిజన్ అవార్డ్ ఇంకా నంది అవార్డు అందుకున్న తొలి తెలుగు న్యూస్ రిపోర్టర్ గా నిలిచారు.


End of Article

You may also like