ఆ విషయం లో రామ్ చరణ్ భార్య ఉపాసనని ఫాలో అవుతున్న మహేష్ భార్య నమ్రత !

ఆ విషయం లో రామ్ చరణ్ భార్య ఉపాసనని ఫాలో అవుతున్న మహేష్ భార్య నమ్రత !

by Sunku Sravan

Ads

నమ్రత శిరోద్కర్…ఒకప్పటి మిస్ ఇండియా. తెలుగులో రెండే రెండు చిత్రాల్లో నటించి 2005 లో మహేష్ బాబును పెళ్లి చేసుకున్నారు. నమ్రత మహేష్ కాంబినేషన్ లో వచ్చిన వంశీ చిత్రం తో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లి కి దారి తీసింది. వీళ్లిద్దరి జోడి చూడ ముచ్చటగా ఉంటుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను ఆశించిన ప్రేక్షకుల కోరిక ఇక తీరేటట్లు లేదు. కానీ మహేష్ ప్రతి అడుగు వెనుక నమ్రత బలమైన సపోర్ట్ ఉంటుందన్న విషయం ఇండస్ట్రీ మొత్తం తెలిసిందే.

Video Advertisement

మహేష్ లాగే పబ్లిక్ లైఫ్ లో పెద్దగా కనిపించని నమ్రత ప్రవర్తనలో ఈ మధ్య కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ విషయం లో నమ్రత మెగా కోడలు ఉపాసనను ఫాలో అయినట్లు కనిపిస్తుంది. ఉపాసన తనకు సమయం దొరికినప్పుడల్లా చరణ్ సినిమాను ప్రేక్షకుల మధ్య చూస్తూ సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా లో పంచుకుంటుంది. ఈ మధ్యనే విడుదలైన మహేష్ సినిమా సర్కారు వారి పాట ను ప్రేక్షకుల మధ్య సింగల్ స్క్రీన్ థియేటర్ లో చూసిన నమ్రత థియేటర్ లో సినిమా చూసే విషయంలో మెగా కోడలు ఉపాసనను ఫాలో అయినట్లు కనిపించింది. సర్కారు వారి పాట మూవీని ప్రేక్షకుల మధ్య చూసిన నమ్రత మహేష్ ఫ్యాన్స్ నుంచి సినిమా గురించి రెస్పాన్స్ ను కూడా తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నం చేశారు.

Namrata

Namrata

ఇక ఈ మధ్యనే విడుదలైన సర్కారు వారి పాట మొదటి షో నుండే డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాకు ఈ విధంగా ప్రమోషన్స్ చేయడం ద్వారా సినిమాకు ప్లస్ అవుతుందని ఆమె భావించి ఉండొచ్చు.  మహేష్ మూవీ కోసం నమ్రత పడుతున్న కష్టాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.

ఇక మహేష్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో సెట్ అయ్యింది. ప్రస్తుతం హాలిడే లో ఉన్న మహేష్ అండ్ ఫామిలీ హాలిడే నుంచి వచ్చాక జూన్ నుండి మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.


End of Article

You may also like