రాజకీయాల్లో బిజీ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ‘వకీల్ సాబ్’ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ బిజీ గా ఉంటున్నారు. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన పవన్ వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
ఇదిలా ఉండగా పవన్ మరో సినిమాకు ఓకే చెప్పనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ‘సాహో’ ఫేమ్ సుజీత్ తో కలిసి పని చేయడానికి పవన్ రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది.
పవన్ – సుజీత్ కాంబోలో ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుందని అంటున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్ ఒక స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. సుజీత్ మొదటి సిట్టింగ్ లోనే పవన్ ని ఇంప్రెస్ చేసాడని.. ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ చేశారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం లో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషించాడని అంటున్నారు సినీ జనాలు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. ప్రధాన నటీనటులు సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తున్నారని నివేదికలు ఉన్నాయి. అంతేకాదు వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
మరో వైపు పవన్ కొత్తగా మరే ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదని అంటున్నారు. ఇప్పటికైతే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ను పునఃప్రారంభించాలని భావిస్తున్నారని.. వచ్చే నెల 5 నుంచి చేపట్టబోయే జనసేన బస్సు యాత్ర ని దృష్టిలో పెట్టుకుని డేట్స్ కేటాయిస్తాడని టాక్.
ఇక హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్ ‘, ‘వినోద సీతం’ రీమేక్ ప్రాజెక్ట్స్ అనేవి 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికలు – పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల మీదే ఆధారపడి ఉంటాయని అభిప్రాయ పడుతున్నారు. సురేందర్ రెడ్డి చిత్రం అయినా, సుజీత్ లేదా అనిల్ రావిపూడి అయినా ఇప్పట్లో పవన్ తో సినిమా కష్టమే అని అంటున్నారు.