SSMB 28 లో నటించబోతున్న… ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ..?

SSMB 28 లో నటించబోతున్న… ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ..?

by Anudeep

Ads

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Video Advertisement

ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా ఓ కుర్ర హీరోయిన్‌కు అవకాశం వచ్చినట్లు టాక్. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎప్పుడు ఇద్దరు హీరోయిన్ లు ఉండేలా చూసుకుంటారు. అలాగే ఈ చిత్రానికి కూడా మరో హీరోయిన్ ను ఎంపిక చేసారంట త్రివిక్రమ్.

IS THIS NEW HEROINE GETS CHANCE IN MAHESH - TRIVIKRAM MOVIE

తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా వస్తున్న అహింసలో గీతిక తివారి అనే కొత్త అమ్మాయి నటిస్తోంది. ఈ భామకు మహేష్ సినిమాలో అవకాశం వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ భామకు ఇప్పటికే మరొక రెండు సినిమాల్లో ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది.

IS THIS NEW HEROINE GETS CHANCE IN MAHESH - TRIVIKRAM MOVIE
మొదట ఈ పాత్రలో శ్రీలీలను అనుకున్నారు. తర్వాత అనన్య పాండే, సంయుక్త మీనన్, ఫరియా అబ్దుల్లా, ప్రియాంక అరుళ్ మోహన్, నాభ నటేష్, నిధి అగర్వాల్ పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరికి కొత్త హీరోయిన్ అయిన గీతిక తివారి కి ఈ అవకాశం దక్కినట్టు సమాచారం.

IS THIS NEW HEROINE GETS CHANCE IN MAHESH - TRIVIKRAM MOVIE
యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు.దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా దాదాపుగా ఐదు భాషల్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి వస్తున్నట్లు టాక్. ఒక వేళ అదే నిజం అయితే మొదటి మహేష్ పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది.


End of Article

You may also like