Ads
జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు, తనదైన కామెడీ డైలాగ్స్ తో అతి తక్కువ కాలంలోనే షోలో టీం లీడర్ గా ఎదిగారు. జబర్దస్త్ తో పాపులర్ అయిన యాదమ్మ రాజు, స్టెల్లాను ప్రేమ వివాహం చేసుకున్నారు.
Video Advertisement
వీరిద్దరూ కలిసి రీల్స్ చేస్తూ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న యాదమ్మ రాజు రీసెంట్ గా యాక్సిడెంట్ కు గురయ్యారని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కమెడియన్ యాదమ్మ రాజు పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్, అదిరింది, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు, తన భార్య స్టెల్లాతో కలిసి యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. అందులో సరదా వీడియోలను ఆడియెన్స్ తో పంచుకుంటాడు. యాదమ్మ రాజు ప్రస్తుతం జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.
యాదమ్మ రాజు భార్య తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోని చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ వీడియో యాదమ్మ రాజు హాస్పిటల్లో ఉన్నట్టుగా కనిపించాడు. అతని కాలికి దెబ్బ తగిలి, పెద్ద కట్టుతో ఉన్న రాజు నడవలేని స్థితిలో కనిపించారు. అతని భార్య స్టెల్లా అతనిని నడిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని అడుగుతున్నారు. దాంతో రాజు భార్య స్టెల్లా ఇలా వివరణ ఇచ్చారు.
యాదమ్మ రాజు చిన్నప్రమాదానికి గురయ్యారని, త్వరలో కోలుకుంటారు. మాపై చూపిస్తున్న మీ ప్రేమకు ధన్యవాదాలు. ఆయన త్వరగా కోలుకోవాలని పంపిన సందేశాలకు కృతజ్ఞతలని స్టెల్లా కామెంట్ చేశారు. గాయపడిన తన భర్తను ఉద్దేశిస్తూ, నీ పక్కన నేను ఉండగా నీకేం కాదు డియర్ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CvFJXAsv0lG/?utm_source=ig_embed&utm_campaign=loading
Also Read: సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో తెలుసా..? ఆయన ఎలాంటి ఆహారం తీసుకునే వారు అంటే..?
End of Article