Ads
ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో తెలిసిన విషయమే. యూట్యూబ్ లో జబర్దస్త్ వీడియోలు మిలియన్ల వ్యూస్ తో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది.
Video Advertisement
ఇందులో గుర్తింపు పొందిన అనేక మంది ఆర్టిస్టులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. కొందరైతే ఏకంగా హీరో గా కూడా చేస్తూ, తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో గెటప్ శ్రీను (అలియాస్ బొడుపల్లి శ్రీను) టీం ఒకటి.
గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్ ఈ ముగ్గురు కలిసి తమదైన శైలిలో స్కిట్లు చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించే వారు. దీంతో జనాల్లో వీరి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే కొన్ని కారణాలతో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. వీరిద్దరూ తప్పుకోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియనప్పకీ, సోషల్ మీడియాలో అనేక కారణాలు చక్కర్లు కొడుతున్నాయి. తన మిత్రులు షో నుంచి వెళ్లిపోవడంతో రాం ప్రసాద్ ఒక్కడే స్కిట్లతో ఆకట్టుకుంటున్నాడు.
ఇటీవల ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్, సుడిగాలి సుధీర్, కెవ్వు కార్తీక్ వీరి ఫ్రెండ్ షిప్ గురించి ఒక స్కిట్ వేశారు. ఆ స్కిట్ చూస్తూ ఆటో రాం ప్రసాద్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యాడు. అయితే ఆ స్కిట్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపించారు. రేటింగ్స్ కోసమే రాం ప్రసాద్ ఏడ్చాడు అంటూ కొందరు ఘాటు విమర్శలకు దిగారు. ఫిల్మీ ఫోకస్ కథనం ప్రకారం, దీనికి రాం ప్రసాద్ స్పందిస్తూ.. సుధీర్, గెటప్ శ్రీను వెళ్ళిపోవడంతో నేను ఒంటరయ్యాను. తమ స్నేహం eప్పటికీ విడిపోదు, వాళ్లిద్దరూ ఇక్కడ లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయి కానీ రేటింగ్స్ కోసం కాదని సమాధానం ఇచ్చాడు. తాజాగా ఈ స్కిట్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
End of Article