“జై భీం” లో సూర్య పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? టాలీవుడ్ కి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారంటే..?

“జై భీం” లో సూర్య పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? టాలీవుడ్ కి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారంటే..?

by Anudeep

Ads

గత సంవత్సరం ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, ఈ సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు అనే పాత్రను పోషించారు. ఈ పాత్రతో పాటు మరో పాత్ర కూడా మంచి పేరునే తెచ్చుకుంది.

Video Advertisement

rajisha 2

టీచర్ పాత్రని పోషించిన రాజిష విజయన్ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. జై భీం సినిమాలో ఆమె మారుమూల ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు అక్షరాలను, నెంబర్లను నేర్పించే టీచర్ గా కనిపిస్తారు. చిన్నతల్లికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా అయిపోయిన తరువాత కూడా మనం ఈ పాత్రని మర్చిపోలేం. అంతగా నటించి మెప్పించారు రాజిష.

rajisha 1

కేరళలోని కాలికట్ లో 15 జూలై 1991వ సంవత్సరంలో రాజిష జన్మించారు. ఆమె తండ్రి విజయన్. ఆయన ఆర్మీలో పని చేసేవారు. తల్లి గృహిణి. రాజిషకు ఒక చెల్లి కూడా ఉందట. రాజిష నోయిడాలో అమిటి యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం లో డిగ్రీ పూర్తి చేసారు. సినిమాల్లోకి రాకముందు ఆమె యాంకర్ గా పనిచేసేవారట.

rajisha 4

“అనురాగ కరిక్కిన్ వెల్లం” అనే మలయాళ సినిమా ద్వారా రాజిష సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా 2016 లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి గాను రాజిషకు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆ తరువాత తమిళనాడులో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ  కూడా ఆమె నటిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాల్లోకి కూడా రానున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న “రామా రావు ఆన్ డ్యూటీ” సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు.


End of Article

You may also like