Ads
స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, తమిళ డబ్బింగ్ సినిమాలతో కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దళపతి, అజిత్ బాక్సాఫీస్ దగ్గర రెండు మూడు రోజుల తేడాతో పోటీ పడిన విషయం తెలిసిందే.
Video Advertisement
ఇప్పుడు కూడా ఒక రోజు తేడాతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. మరి రెండు చిత్రాలలో ఎవరి సినిమా విజయం సాధిస్తుందో అని అటు మెగా ఫ్యాన్స్, ఇటు రజినీ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ భోళా శంకర్. ఈ చిత్రంలో తమన్నా. కీర్తి సురేష్, సుశాంత్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆగస్ట్ 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ మూవీ యావరేజ్ టాక్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటించారు. జైలర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. ఇక మూవీలోని ‘కావాలయ్యా సాంగ్’ తమిళ వెర్షన్ కు 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది.
ఈ పాటతో, ట్రైలర్ తో ఈ మూవీ పై అంచనాలను భారీగా పెరిగాయి. ఈ మూవీ ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ఈ మూవీ తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలను కంపేర్ చేస్తే సబ్జెక్ట్ కూడా డిఫరెంట్, జైలర్ మూవీకి హిట్ టాక్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read: “రజనీకాంత్” తో పాటు… “మద్యానికి బానిస” అయ్యి దాదాపు తమ కెరీర్ నాశనం చేసుకున్న 6 నటులు వీరే..!
End of Article