సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో వెనుక కన్నీటి కథ ఇదే..!!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో వెనుక కన్నీటి కథ ఇదే..!!

by Anudeep

Ads

రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి ఫొటోని సామాన్యుల నుండి సెలబ్రిటి వరకు అనేక మంది శేర్ చేశారు..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైన ఫోటోల్లో అతడిది ఒకటి.. వలస కూలీలు ఒక్కొక్కరిది ఒక్కో కథ అయితే..ఈ వ్యక్తిది ఒక కథ..ఆ ఫోటో శేర్ చేసే సమయానికి ఎవరికి ఆ విషయం తెలీదు..కానీ ఆ ఫోటోలోని కన్నీటి వెనుక హృదయ విదారక కన్నీటి కథ ఉంది.. అదిప్పుడు నెటిజన్లను మరింతగా బాధపెడుతోంది..

Video Advertisement

బీహార్ లోని బెగుసారై కి చెందిన రామ్ పుకార్ , నవాడా లో వలస కూలిగా ఉపాది పొందుతున్నారు.. లాక్ డౌన్ కారణంగా పనులు లేక, రవాణా సౌకర్యం లేక ఊరికి వెళ్లకుండా నవాడాలోనే ఆగిపోయారు.. కానీ రామ్ పుకార్ ఏడాది వయసు కొడుకు చనిపోయాడని ఇంటి నుండి ఫోన్ రావడంతో, ఏం ఆలోచించకుండా కాలినడకన  ఊరికి వెళ్లాలని బయల్దేరాడు.కానీ  ఘజియాబాద్ ఫ్లైఓవర్ చేరుకునే సరికి పోలీసులు రామ్ పుకార్ ని ఆపేశారు..

తన కుమారుడు చనిపోయాడని,వెళ్లాలని ఎంత వేడుకున్నా పోలీసులు కనికరించకపోవడంతో అక్కడే రోడ్డు పైన కూలబడిపోయి ఇంటికి ఫోన్ చేసి ఏడుస్తున్నప్పుడు అక్కడే ఉన్న పిటిఐ ఫొటోగ్రాఫర్ అతుల్ యాదవ్ తీసిన ఫోటోనే అది. ఎన్జీవో కార్యకర్తలు పెట్టిన ఫూడ్ తింటూ మూడు రోజుల పాటు రామ్ పుకార్ అక్కడే ఉండిపోయాడు. తర్వాత అతడిని అందరితో పాటు న్యూఢిల్లి రైల్వేస్టేషన్ లో వదిలిపెట్టగా, అక్కడి నుండి బీహార్ కి ఏర్పాటు చేసిన శ్రామిక్ ట్రైన్లో బెగుసారై చేరుకున్నారని సమాచారం.

representative image

పోలీసులు తన మాట వినలేదని లేదంటే కనీసం నా కొడుకు చివరి చూపుకు అయినా నోచుకునేవాడిని, నేను లేకుండానే నా కుటుంబం ఒంటరిగా నా కొడుకుకి వీడ్కోలు పలికింది.. సరిహద్దుల్లో పోలీసులతో పోరాటం చేయడం కంటే, జీవితాంతం ఈ బాధతో బతకడం చాలా కష్టం అని కన్నీరు మున్నీరు అయ్యారు రామ్ పుకార్. ప్రస్తుతం బెగుసారైలోని ఒక స్కూల్లో కొవిడ్ -19 టెస్టుల కోసం తీసుకువెళ్లారు, తర్వత పద్నాలుగు రోజుల క్వారంటైన్ పీరియడ్ ముగిసిన తర్వాత అతడు తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటో వెనుక కన్నీటి కథ ఇది.


End of Article

You may also like