Ads
కరోనా మహమ్మారి కారణం గా ఆక్సిజెన్ లెవెల్స్ తగ్గిపోతే వారి పరిస్థితి విషమిస్తోంది. మరోవైపు ఆక్సిజెన్ దొరకక నానా అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ క్రమం లో ఆనందయ్య ఇచ్చిన మందు వేసుకోవడం వలన ఆక్సిజెన్ లెవెల్స్ కొందరికి పెరగడం తో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. కృష్ణపట్నం ఆనందయ్య మందు కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఆనందయ్య మందు వేసుకోవడం వలన కరోనా పూర్తి గా తగ్గకపోయినా.. సైడ్ ఎఫెక్ట్స్ రావని వైద్యులు చెప్పడం తో.. చాలా మంది ముందుకొచ్చారు.
Video Advertisement
ఈ క్రమం లో ఆనందయ్య కూడా తన దగ్గరకు వచ్చిన వారికి ఉచితం గానే మందుని పంపిణి చేసారు. ఐతే.. కొందరు మాత్రం దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు ఉద్దేశ్యపూర్వకం గానే ఆనందయ్య పేరు తో మందు తయారు చేసి విక్రయిస్తున్నారు. తన పేరు పై నకిలి మందు పంపిణి జరుగుతోందని.. ఈ మందు వికటిస్తే అందుకు తానూ బాధ్యుడిని కాదని ఆనందయ్య స్పష్టం చేసారు. కరోనా రోగులకు ఆనందయ్య ఇస్తున్న మందు దివ్య ఔషధం గా పనిచేస్తోంది.
End of Article