Krithi Shetty: బేబమ్మా.. ఈ డిమాండింగ్ ఏంటమ్మా..? కృతి శెట్టి డెసిషన్ పై షాక్ అవుతున్న నిర్మాతలు.. అసలేమైందంటే..?

Krithi Shetty: బేబమ్మా.. ఈ డిమాండింగ్ ఏంటమ్మా..? కృతి శెట్టి డెసిషన్ పై షాక్ అవుతున్న నిర్మాతలు.. అసలేమైందంటే..?

by Anudeep

Ads

ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి కుర్ర కారు గుండెల్లో నిలిచిపోయింది. సినిమా రిలీజ్ కి ముందే విడుదల అయిన “నీ కళ్ళు నీలి సముద్రం” పాట ఆమెను అమాంతం ఆకాశానికెత్తేసింది. ఆమె కళ్ళు, అందం, అభినయం అన్నిటికి తెలుగు యువత ఫిదా అయిపోయారు. “ఉప్పెన” సినిమా రిలీజ్ అయ్యాక కృతి శెట్టి బేబమ్మ గా మరింత ఫేమస్ అయిపోయారు.

Video Advertisement

krithi 1

అంతే కాదు.. ఆమెకు వరుస అవకాశాలు కూడా వచ్చేసాయి. వరుస అవకాశాలు రావడంతో రాత్రికి రాత్రే ఆమె రేంజ్ మారిపోయింది. అయితే.. వరుస అవకాశాలు రావడం తో బేబమ్మ డిమాండింగ్ కూడా స్టార్ట్ చేసేసిందట. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండడం తో అటు నిర్మాతలు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఆఫర్లు రాని సమయం లో పాతిక లక్షల రెమ్యునరేషన్ కి కూడా ఆక్ట్ చేసే హీరోయిన్లు ఒక్కసారి గా పాపులర్ అయ్యాక రెమ్యునరేషన్ పెంచుతున్నారంటూ నిర్మాతలు ఫీల్ అవుతున్నారట.

krithi 2

ఉప్పెన సినిమాకి కృతి శెట్టి ఇరవై లక్షల పారితోషికాన్ని అందుకున్నారట. ఈ సినిమా రిలీజ్ కి ముందే రామ్ తో మరో సినిమాకి కృతి శెట్టి సైన్ చేసేసారు. ఈ సినిమాకి గాను ఆమె యాభై లక్షల వరకు రెమ్యునరేషన్ ను తీసుకున్నారు. తాజాగా.. మరో సినిమాకి ఆమె సైన్ చేయాల్సి ఉంది. చైతన్య తో తీయబోయే “బంగార్రాజు” సినిమా కి కూడా కృతి శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నారట.

krithi 3

కానీ, ఈ సినిమా కోసం ఆమె రెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట. కోటి లోపు వరకు డిమాండ్ చేసినా పర్లేదు కానీ, ఒకేసారి రెండు కోట్లకు రెమ్యునరేషన్ పెంచడం తో నిర్మాతలు షాక్ అవుతున్నారు. కొత్తగా వచ్చే వారికి ఇంత రెమ్యునరేషన్ ఇస్తే.. మరి కీర్తి, కాజల్, సమంత, రష్మిక, పూజ హెగ్డే లాంటి హీరోయిన్లకి ఇంకెంత రెమ్యునరేషన్ ఇవ్వాలి..? అంటూ ప్రశ్నిస్తున్నారట. ఈ నేపధ్యం లో కృతి పారితోషికం విషయం లో ఆలోచించుకోవాలని హితవు చెప్తున్నారట. ఏదేమైనా.. ఉప్పెన గట్టిగానే ఎగసిపడుతోందన్నమాట.


End of Article

You may also like