“ఖైదీ” షూటింగ్ లో కార్తీ అంత పని చేశాడా..! లోకేష్ కనగరాజ్ ఏమన్నారంటే..?

“ఖైదీ” షూటింగ్ లో కార్తీ అంత పని చేశాడా..! లోకేష్ కనగరాజ్ ఏమన్నారంటే..?

by Anudeep

Ads

యుగానికి ఒక్కడు చిత్రంతో వెండి తెరకు పరిచయమైన కార్తీ శివకుమార్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించాడు. కార్తీ నటించే ప్రతి చిత్రంలో కూడా ఆయన నటన ఎంతో సహజంగా కనిపిస్తుంది.

Video Advertisement

2019 అక్టోబర్ లో కార్తీ నటించిన ఖైదీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల లోకేష్ కనకరాజు ఒక ఇంటర్వ్యూలో ఖైదీ చిత్ర షూటింగ్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

 

ఖైదీ చిత్రంలో ఒక ఫైటింగ్ సీన్ లో కార్తీ శరీరం మొత్తం మట్టి అంటుకొని ఉంటుంది. అక్కడితో ఆ సన్నివేశాన్ని పూర్తి చేసి, మిగతా సన్నివేశాన్ని చెన్నైలో పూర్తి చేద్దామని అనుకున్నారట. చెన్నై వెళ్లిన తర్వాత మీకు ఈ సీన్లో మట్టి అంటుకొని ఉంటుంది ఒంటికి పూసుకోండి అని లోకేష్ కనకరాజ్ టీం చెప్పారట. ఆ మట్టిని పోసుకోవడానికి కార్తీ నిరాకరించారుట. ఎందుకంటే ఆ సీన్ లో మట్టికి, చెన్నైలో ఇచ్చిన మట్టికి  మధ్య తేడా ఉండడమే కారణం.

అక్కడ సీన్ పూర్తి అయిన తర్వాత తన అసిస్టెంట్ తో ఆ మట్టిని తీసుకురమ్మని ముందుగానే చెప్పారట. ఎందుకంటే ఏ సన్నివేశంలో కంటిన్యుటీ మిస్ అవ్వకూడదు అని,  దానివల్ల సన్నివేశాల్లో పర్ఫెక్షన్ పోతుందని కార్తీ ఆ మట్టిని తనవెంటే తీసుకువచ్చారు దీన్నిబట్టే కార్తీ చిత్ర సన్నివేశాల విషయంలో అంత  డెడికేటెడ్ గా ఉంటారు అని లోకేష్ కనకరాజ్  ఇంటర్వ్యూలో వెల్లడించారు..


End of Article

You may also like