SSMB 28 పై వార్తలు అన్ని అబద్దమేనా..? అసలు కథ ఏంటంటే..?

SSMB 28 పై వార్తలు అన్ని అబద్దమేనా..? అసలు కథ ఏంటంటే..?

by Anudeep

Ads

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు మహేష్. ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సూపర్ స్టార్ త్రివిక్రమ్ తో మరో చిత్రం చేయనున్నాడు. ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో ఉండబోతోందట.

Video Advertisement

మహేష్ బాబు ఈ సినిమాలో ఐటీ మినిస్టర్ పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను”లో యంగ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే మరోసారి మహేష్ ఇలాంటి పొలిలిటిక్ కాన్సెప్ట్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని టాక్. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ ఐటీ మినిస్టర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

మొన్నటి వరకు వెకేషన్ లో ఉన్న మహేష్ బాబు మరోసారి లండన్ వెళ్ళబోతున్నట్లు సమాచారం.  కొడుకు గౌతమ్ ఘట్టమనేని చదువు నిమిత్తం మహేష్ బాబు మరోసారి లండన్ వెళ్తున్నాడని సమాచారం. అనంతరం త్రివిక్రమ్ తో షూటింగ్ లో పాల్గొననున్నాడు మహేష్. ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హేగ్డే నటించనుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయనున్నాడు.


End of Article

You may also like