Ads
మహానటి చిత్రం ద్వారా తెలుగు తెర కు చేరువై, జెమినీ గణేషన్ క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేసి అందరినీ మెప్పించిన నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళీ స్టార్ హీరో అయినా దుల్కర్ సల్మాన్ కు తెలుగులో చాలా తక్కువ ఫాలోయింగ్ ఉండేది. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన సీతారామం సినిమా తర్వాత అతనికి తెలుగులో కూడా అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకే ఈ దుల్కర్ సల్మాన్ అన్న విషయం చాలామందికి తెలియదు.
Video Advertisement
మహానటిలో జెమినీ గణేషన్ పాత్రలో అమ్మాడి అంటూ అతను పిలిచే పిలుపు చాలా హైలెట్ గా నిలిచింది. మహానటి చిత్రం సక్సెస్ లో అతను తన వంతు పాత్ర పోషించాడు అని చెప్పవచ్చు. దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు మలయాళం నుంచి డబ్ చేసిన సినిమాల ద్వారా మాత్రమే ప్రేక్షకులకు పరిచయం. కానీ మొదటిసారి సీతారామం ద్వారా డైరెక్ట్ తెలుగు మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ తన నటనతో అందరిని మెప్పించాడు.
ఈనెల రిలీజ్ అయి భారీ బాక్సాఫీస్ రికార్డు అందుకున్న చిత్రం సీతారామం లో లెఫ్టినెంట్ రామ్ క్యారెక్టర్ కు దుల్కర్ చాలా బాగా సెట్ అయ్యాడు అనేది ఎందరో నెటిజన్లు అభిప్రాయం. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తన సినిమా ఫీల్డ్ లోకి వస్తానన్నప్పుడు తన తండ్రి మమ్ముట్టి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు..
” నాన్నకు నేను నటించడం పెద్దగా ఇష్టం లేదు. నా చదువు పూర్తయిన వెంటనే జాబ్ చేసుకోమని దుబాయ్ కి పంపించారు. కానీ నటన మీద అభిమానంతో నేను అక్కడ ఉద్యోగం చేయలేక తిరిగి వచ్చేసాను. హీరో అవ్వాలన్న నా కోరిక విని నాన్న నీకు నటించడం రాదు చిన్న డాన్స్ కూడా చేయలేదు. ఇలా నువ్వు తెర పైన కనిపిస్తే…పోయేది నా పరువే. నీకు యాక్టింగ్ రాకపోతే మొదటి తిప్పేది కూడా నన్నే…”అని తన తండ్రి మాటలను తిరిగి ఒకసారి గుర్తు చేసుకున్నాడు దుల్కర్
End of Article