కరోనా సోకిందని భార్యని బాత్ రూమ్ లోనే ఉంచి.. ఆమె కోసం బయట గొయ్యి తవ్వి.. ఆపై..!

కరోనా సోకిందని భార్యని బాత్ రూమ్ లోనే ఉంచి.. ఆమె కోసం బయట గొయ్యి తవ్వి.. ఆపై..!

by Anudeep

Ads

కరోనా కారణం గా ఎక్కడ లేని ఘోరాలని చూడాల్సి వస్తోంది. ఓ భర్త తన భార్యకు కరోనా సోకడం తో ఆమెను చిత్ర హింసలకు గురి చేసాడు. ఆమెకు కరోనా వచ్చిందన్న కారణం తో ఆమెను బాత్ రూమ్ లోకే పరిమితం చేసాడు. లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్ గోపాలవాడ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సమ్మ కు కరోనా రావడం తో ఆమె భర్త పెద్దయ్య ఇంట్లో సరిపడా గదులు ఉన్నప్పటికీ ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. అంతే కాదు.. ఆమెను మరుగుదొడ్డి కూడా ఉపయోగించనివ్వకుండా.. ఇంటికి సమీపం లో ఓ గొయ్యి తవ్వి అందులోనే మల మూత్రాది కార్యక్రమాలు చేసుకోవాలని ఆంక్షలు విధించాడు.

Video Advertisement

women

అయితే, కొన్ని రోజులకు చుట్టూ పక్కల వారికి వాసన వస్తుండడం తో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు వచ్చి.. పరిస్థితి తెలుసుకుని నర్సమ్మ భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమెను ఐసోలేషన్ కు తరలించడానికి ప్రయత్నించగా.. ఆమె అందుకు అంగీకరించలేదు. అయితే.. వారు ఆమె భర్త పెద్దయ్య కు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇంట్లోనే ఓ గది ఏర్పాటు చేయించారు. దీనితో పరిస్థితి చక్కబడింది.


End of Article

You may also like