హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ మూవీ.. డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్..ఎందులో చూడచ్చు అంటే.?

హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ మూవీ.. డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్..ఎందులో చూడచ్చు అంటే.?

by Mounika Singaluri

Ads

తమిళంలో మారి సెల్వరాజ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈయన తీసిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మారి సెల్వరాజ్ తర్వాత 2018లో పరియేరుమ్ పెరుమాళ్ అనే సినిమా తీసి తన కెరీర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. దాని తర్వాత మూడేళ్లు టైం తీసుకుని ధనుష్ తో కర్ణన్ అనే సినిమా తీసి రికార్డ్ స్థాయి బ్లాక్ బస్టర్ ని కొట్టారు. కర్ణన్ సినిమా చాలా బాగుంటుంది.

Video Advertisement

చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ధనుష్ లో ఒక కొత్త కోణాన్ని చూపించారు మారి సెల్వరాజ్. తన డైరెక్షనల్ వాల్యూస్ అన్నిటిని సినిమాలో ఉపయోగించి అందరి దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్ళీ రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మామన్నన్ అనే చిత్రంతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. తమిళంలో ఫేమస్ కమీడియన్ అయిన వడివేలు ని మెయిన్ క్యారెక్టర్ లో పెట్టారు. ఉదయనిది స్టాలిన్ ని హీరోగా పెట్టినా సరే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వడివేలే.

ఇప్పటివరకు కమెడియన్ గా చూసిన వడివేలు ని ఒకేసారి ఒక సీరియస్ క్యారెక్టర్ లో ఎమోషనల్ గా చూపించారు. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లు తీసిన తర్వాత మారి సెల్వరాజ్ తర్వాత చిత్రం ఇంకా ఎంత బాగుంటుందో అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ట్విస్ట్ వచ్చింది. మారి సెల్వరాజ్ తర్వాత చిత్రం ఓటీటిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా పేరే వాజై. కలైయరాసన్, నిఖిలా విమల్, ప్రియాంక, దివ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాగుంటుందని ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది.

ఇన్ని బ్లాక్ బస్టర్లు కొట్టి థియేటర్లో విడుదల చేయట్లేదు ఎందుకు అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ వాళ్ళు. అందుకే డైరెక్ట్ గా వాళ్ళ ఓ టి టి లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది అని పోస్టర్ రిలీజ్ చేశారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో నుంచి మరొక బ్లాక్ బస్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు.


End of Article

You may also like