బాలీవుడ్ లో బాగా పేరు తెచ్చుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం తమిళ, తెలుగు భాషల్లో కూడా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వెండితెరపై తళుక్కుమనే సెలెబ్రిటీలు బుల్లితెరపై కనిపించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాని బుల్లితెరపైకి తీసుకొచ్చిన “మాస్టర్ చెఫ్” షో పాపులర్ అయింది.
Video Advertisement
ఈ వార్తల సారాంశం ఏమిటంటే.. మాస్టర్ చెఫ్ నిర్వాహకులు తమన్నాకు సరిగా పేమెంట్స్ చేయలేదట.. ఈ షో కోసం తమన్నా మరో ప్రాజెక్ట్ ని కూడా వదులుకుంది.. కానీ మాస్టర్ చెఫ్ నిర్వాహకులు ఆమెను అర్ధాంతరంగా తప్పించడమే కాకుండా.. తమన్నాతో కమ్యూనికేషన్ ను కట్ చేసారట.. దీనితో తమన్నాకు లీగల్ యాక్షన్ తీసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయిందట.. దీనిపై మాస్టర్ చెఫ్ నిర్వాహకులు కూడా స్పందించారు.
తమన్నాను హోస్ట్ గా తీసుకున్నపుడు రూ.2కోట్లు రెమ్యునరేషన్కు మాట్లాడుకున్నామని.. మొత్తం 18 రోజులకు గాను ఆమె హోస్ట్ గా వ్యవహరించేందుకు సైన్ చేశారన్నారు. ఇందులో ఆమె 16 రోజులు మాత్రమే షూట్ కి హాజరు అయ్యారని..అందుకు గాను కోటి 56 లక్షల రూపాయల పేమెంట్ చేశామని తెలిపారు. ఆమె రెండు రోజులు రాకపోవడం వలన మూడొందల మంది పనిచేసే ప్రొడక్షన్ హౌస్ కి ఐదు కోట్ల రూపాయలకు పైనే నష్టం వచ్చిందన్నారు. ఆ రెండు రోజులు ఆమె షూట్ కి వచ్చి ఉంటె.. మిగతా అమౌంట్ ను కూడా ఇచ్చేవాళ్లమని.. కానీ ఆమె రాకుండా.. సెకండ్ సీజన్ కి అడ్వాన్స్ అడుగుతున్నారన్నారు. అసలు సెకండ్ సీజన్ కి ఆమెను హోస్ట్ గా తీసుకోవాలని అనుకోలేదన్నారు.