Ads
రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ సినీ, రాజకీయ వర్గాల మధ్య చిచ్చు రేపింది. ప్రస్తుతం పరిస్థితి పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ లా తయారైంది. పవన్ వ్యాఖ్యలపై పోసాని దుమ్మెత్తి పోయడం తో.. పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఈ దుమారం ఇంకా కొనసాగుతుండగానే రంగం లోకి మెగా డాటర్ ఎంట్రీ ఇచ్చింది.
Video Advertisement
పోసాని రియల్ లైఫ్ లో కూడా మెంటల్ కృష్ణ అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పోసాని ని వెంటనే ఆసుపత్రి లో చేర్పించాలన్నారు. రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో పవన్ ఆడవారిపై అనుచితం గా మాట్లాడలేదన్నారు.. కేవలం సీఎం జగన్ పై విమర్శలు చేసినందుకే పోసాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పోసాని ఓ మానసిక రోగి అని.. ఆయన్ను వెంటనే ఆసుపత్రి లో చేర్పించాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గొడవ పైన, పోసాని పైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలన్నారు.
End of Article