Ads
ఎప్పుడు యాడ్స్ లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించని చిరంజీవి ఇటీవల ఫ్యాన్స్ అందరిని షాక్ కి గురి చేసారు. ఎప్పుడో ఒకసారి థమ్స్ అప్ యాడ్ లో నటించారు. ఆ తరువాత మళ్ళీ అటువైపు చూడలేదు. తాజాగా చిరంజీవి ఓ యాడ్ లో నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
Video Advertisement
శుభ గృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఓ యాడ్ లో చిరంజీవి నటించారు. మరో విశేషం ఏంటంటే.. ఈ యాడ్ ను సుకుమార్ డైరెక్ట్ చేసారు. ఖుష్బూ, అనసూయ కూడా ఈ యాడ్ లో నటించారు.
అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ యాడ్ కు సంబంధించిన ఆసక్తికరమైన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో చిరు నటించడమే ఓ ఆశ్చర్యకరమైన విషయం. అయితే.. ఇందులో నటించడం కోసం చిరంజీవి ఎంత రెమ్యునెరేషన్ తీసుకుని ఉంటారు అన్న విషయమై చర్చ నడుస్తోంది. ఈ ఒక్క యాడ్ కోసమే మెగాస్టార్ చిరంజీవి ఆయన సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ లో సగం తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ యాడ్ కోసమే మొత్తంగా ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారని టాక్. ప్రస్తుతం మెగాస్టార్ చిరు చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య త్వరలోనే విడుదల కానుంది.
End of Article