“నాకే ఎందుకు ఇలా జరుగుతోంది..?” అంటూ నటి “మేఘనా లోకేష్” కామెంట్స్..! ఏం అన్నారంటే

“నాకే ఎందుకు ఇలా జరుగుతోంది..?” అంటూ నటి “మేఘనా లోకేష్” కామెంట్స్..! ఏం అన్నారంటే

by kavitha

Ads

బుల్లితెర సీరియల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఏ ప్రోగ్రామ్ కు లేని ఆదరణ సీరియల్స్ కు ఉంటుందని చెప్పవచ్చు. సీరియల్స్ లో హీరోయిన్ పాత్రలలో నటించేవారికి, గుర్తింపు, క్రేజ్ ఎక్కువే. ఒకప్పుడు సీరియల్స్ చూసినవారికి మాత్రమే వారి గురించి తెలిసేది.

Video Advertisement

సోషల్ మీడియా కారణంగా సీరియల్స్ లో నటించే నటీనటులు మరింత గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. సీరియల్ నటి మేఘనా లోకేష్ కు బుల్లితెర పై మంచి గుర్తింపు ఉంది. తాజాగా మేఘనా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చేసింది. ఏమైందా అని నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. తెలుగు సీరియల్స్‌లో ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యత కన్నడ నటీనటులకు ఇస్తున్నారనే విషయం తెలిసిందే. వారికి తెలుగులో నటిస్తే ఎక్కువగా గుర్తింపు, పాపులారిటీ లభిస్తుండడంతో కన్నడ నటీనటులు తెలుగు సీరియల్స్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా వచ్చిన కన్నడ నటి మేఘనా లోకేష్.
శశిరేఖ పరిణయం సీరియల్‌ తో తెలుగువారికి పరిచయం అయ్యింది. శశి పాత్రలో నటించిన మేఘనా లోకేష్ అందం, నటన అప్పట్లో బుల్లితెర ఆడియెన్స్ ను  మెప్పించింది. ఆ సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ప్రస్తుతం  మేఘనా పలు సీరియల్స్ లో నటిస్తూనే, జీ తెలుగుఛానెల్ ఈవెంట్లు మరియు షోలలో కూడా సందడి చేస్తోంది. బుల్లితెరపై మేఘనాకు ఒకప్పుడు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఆమె  హీరోయిన్‌గానూ నటించిది. కానీ విజయం సాధించలేదు.
మేఘనా లోకేష్ తాజాగా ఇన్ స్టా స్టోరీలో ఒక పోస్ట్‌ షేర్ చేసింది. అందులో మళ్లీ ఈరోజు నాకు చెడు రోజు. ఈ సంవత్సరం నన్ను ఇలా ఎందుకు బాధపెడుతోంది. ఏం అయ్యిందో అని అందరూ ఎక్కువగా ఆలోచించకండి. ప్రస్తుతం ఆ విషయాలను షేర్ చేసుకోలేను. మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ఇలాంటివి ఈ సంవత్సరం చాలా జరిగాయి. మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందని రాసుకొచ్చారు. అయితే ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు. దీంతో ఏమైందని ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

Also Read: హీరోయిన్ “కుష్బూ” కి ఈ గుడి వాళ్ళు పూజ ఎందుకు చేసారు..? అసలు విషయం ఏంటంటే..?


End of Article

You may also like