ఇదేందయ్యా ఇది.. అక్కడ ఎవరు ఉన్నారు..? అఖండ సినిమాలో ఈ పొరపాటు గమనించారా..?

ఇదేందయ్యా ఇది.. అక్కడ ఎవరు ఉన్నారు..? అఖండ సినిమాలో ఈ పొరపాటు గమనించారా..?

by Anudeep

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. గత ఏడాది డిసెంబర్ రెండున అఖండ విడుదల అయ్యింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

akhanda 1
అఖండ సినిమాలో మురళీ కృష్ణగా, అఖండగా రెండు పాత్రల్లో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి సినిమాలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే.. అఖండ సినిమాలో కూడా ఒక పొరపాటు జరిగింది. అది ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ సినిమాలో ఓ సమావేశం సందర్భంగా.. బాలకృష్ణ సినిమాలో మినిస్టర్ గా నటించిన సుబ్బరాజుని పొగిడే సన్నివేశం ఉంటుంది.

akhanda 2

ఈ సన్నివేశంలో బాలకృష్ణ సుబ్బరాజుని పొగుడుతారు. చివరగా ఆయన వైపు చేయి చూపిస్తూ పొగుడుతారు. కానీ సుబ్బరాజు ఒక వైపు ఉంటె.. బాలకృష్ణ మరొక వైపు చేయి చూపిస్తూ ఉంటారు. ఈ సినిమా మొదటి సారి చూస్తున్నపుడు ఎవరికీ ఇలాంటి డౌట్ వచ్చి ఉండదు. కానీ.. ఇటీవల ఈ సినిమా ఓటిటిలో విడుదల అవ్వడంతో ఈ విషయాన్నీ బాగా అబ్జర్వ్ చేసారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా మీమ్స్ ట్రేండింగ్ లో ఉన్నాయి.

Watch Video:

Click Here —-> Video Link


End of Article

You may also like