స్వతంత్రం రాకముందు పరిస్థితులు ఇలా ఉండేవా..? ఈ సినిమా చూశారా..?

స్వతంత్రం రాకముందు పరిస్థితులు ఇలా ఉండేవా..? ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

ప్రముఖ తమిళ దర్శకుడు మురుగ‌దాస్ నిర్మించిన కోలీవుడ్ మూవీ ‘ఆగ‌స్ట్ 16 1947’. ఈ చిత్రం రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

Video Advertisement

ఈ చిత్రంలో గౌత‌మ్ కార్తిక్‌, రేవ‌తి శ‌ర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎన్‌.ఎస్ పొన్‌కుమార్ తెరకెక్కించాడు. పీరియాడిక‌ల్ ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఇండియాకి స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష‌ర్లు భారతీయుల పై చేసిన ఆరాచ‌కాలు మరియు అన్యాయాల‌ను చూపిస్తూ ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. కానీ స్వాతంత్య్రం వ‌చ్చిన రోజు, ఆ మరుసటి రోజున ఏం జ‌రిగింద‌నే విషయంతో ఇప్పటివరకు ఎవ‌రూ చిత్రాలను తెరకెక్కించలేదు. ఆ పాయింట్ తో వచ్చిన చిత్రమే ఈ ‘ఆగ‌స్ట్ 16 1947’. డైరెక్టర్ మురగదాస్ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్‌.ఎస్ పొన్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సెంగాడు అనే చిన్న‌ప‌ల్లెటూరు దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. ఆ ఊరిని బ్రిటీష్ జ‌న‌ర‌ల్ అయిన రాబ‌ర్ట్ శాసిస్తుంటాడు. ప్ర‌జ‌ల‌ందరిని బానిస‌లుగా చూసే రాబ‌ర్ట్‌, ఎదురుతిరిగిన ప్రజలను కిరాతకంగా చంపుతూ ఉంటాడు. దాంతో అక్కడి వారు భయపడుతూ జీవిస్తుంటారు. అయితే రాబ‌ర్ట్ కు జ‌స్టిన్ అనే కుమారుడు ఉంటాడు. అతను స్త్రీలోలుడు. జ‌స్టిన్ నుండి తమ అమ్మాయిలను కాపాడుకునే మార్గం లేకపోవడంతో తమకు పుట్టిన ఆడపిల్లలను ఊరివారే చంపేస్తుంటారు.
కానీ సెంగాడు జమీందారు తమ కుమార్తె తేన్‌మ‌ల్లి (రేవ‌తిశ‌ర్మ‌)ను చంపలేక, రహస్యంగా తన తన భవనంలోనే  పెంచుతాడు. అందరిని ఆమె చిన్నప్పుడే చనిపోయిందని నమ్మిస్తాడు. జమీందారు కుటుంబానికి, జస్టిన్ దగ్గర పనిచేసే ప‌ర‌మాన్ (గౌత‌మ్ కార్తిక్‌) కు తప్ప ఆమెకు బ్రతికి ఉన్నట్టు ఎవరికి తెలియదు. ప‌ర‌మాన్ కి జస్టిన్ చేసే అరాచకాలను సహించలేక, ఎదురించాలని అననుకున్నప్పటికి, ప్రజల సహాయం లేకపోవడంతో మౌనంగా భరిస్తుంటాడు. అతను తేన్‌మ‌ల్లిని ప్రేమిస్తుంటాడు.
ఆమె ఆ నాలుగు గోడల మధ్యనుండి బయటికి రావాలని భావస్తుంది. ఈ క్రమంలోనే ఒక రోజు తేన్‌మ‌ల్లి జ‌స్టిన్ దృష్టిలో పడుతుంది. అతని నుండి తేన్‌మ‌ల్లిని కాపాడడం కోసం ప‌ర‌మాన్ ఏం చేశాడు? ఆమెకు తన ప్రేమ గురించి చెప్పాడా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంగతిని ఆ ఊరి ప్రజల దగ్గర దాచిపెట్టి, అరాచకాలను చేస్తున్న రాబ‌ర్ట్ కు ఆ ఊరి ప్రజలు ఎదురు తిరిగారా? లేదా అనేది మిగతా కథ.
ఈ చిత్రం కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. 1947 నాటి ప్ర‌జ‌ల వేష‌ధార‌ణ‌, సెట‌ప్‌, భాష‌ల్ని వాస్తవంగా డిజైన్ చేసుకున్నాడు. కథకు తగినట్టుగా న‌టీన‌టులు చక్కగా నటించారు. కానీ దర్శకుడు తాను అనుకున్న స్టోరీని తెరపై చూపించడంలో త‌డబ‌డ‌టంతో మూవీ మొదటి నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు బోరింగ్‌గా సాగిన ఫీల్ వస్తుంది. లవ్ స్టోరీ కూడా రొటీన్ గా అనిపిస్తుంది. ప‌ర‌మాన్ గౌత‌మ్ కార్తిక్ చాలా సహజంగా న‌టించాడు. తేన్‌మ‌ల్లిగా రేవతిశర్మ  నటన తేలిపోయింది. రాబ‌ర్ట్‌, జ‌స్టిన్ పత్రాలు చేసిన నటులు విల‌న్స్ గా బాగా నటించారు.

Also Read: “రావణాసురుడి తలలని ఇలా చూపించారు ఏంటి..?” అని ట్రోల్ చేశాం..! కానీ ఇదే నిజమా..?


End of Article

You may also like