20 ఏళ్ల కిందట వచ్చిన సినిమాకి ఇపుడు సీక్వెల్..! ఈ సినిమా చూశారా..?

20 ఏళ్ల కిందట వచ్చిన సినిమాకి ఇపుడు సీక్వెల్..! ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

బాలీవుడ్ లో ఎప్పుడో స్టార్ డమ్ తగ్గి, రిటైర్ మెంట్ కు చేరువలో ఉన్న సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘గదర్ 2’ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘గదర్’ సీక్వెల్ గా వచ్చిన మూవీ ‘గదర్ 2’. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి మాస్ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

Video Advertisement

ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పఠాన్ మూవీ 6 రోజుల కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసింది. ముఖ్యంగా పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ట్రాక్టర్లు కట్టుకుని జనాలు మల్టీప్లెక్సులకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
2001లో రిలీజ్ ‘గదర్’ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. పాకిస్తాన్‌లోని పొలిటికల్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన సకీనా (అమీషా పటేల్)  తో అమ్మాయితో సిక్కు అయిన తారా సింగ్ (సన్నీ డియోల్) ల ప్రేమకథ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. ఈ మూవీకి 22 ఏళ్ల తరువాత సీక్వెల్ గా వచ్చిన ‘గదర్ 2’ కు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కూడా సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు.
గదర్ 2 కథ విషయానికి వస్తే, ఇది తండ్రికొడుకుల చుట్టూ సాగే కథ. తారా సింగ్ (సన్నీ డియోల్), సకీనా (అమీషా పటేల్) సంతోషంగా జీవిస్తుంటారు. వీరి కుమారుడు చరణ్‌జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) పెద్దవాడవుతాడు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం అవుతుంది. పాకిస్తానీ ఆర్మీతో పోరాడుతుండగా, సరిహద్దుల్లో  చిక్కుకున్న ఆర్మీ యూనిట్‌కు సాయం చేయాల్సిందిగా ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర రావత్ (గౌరవ్ చోప్రా) తారా సింగ్ ను అడుగుతాడు.
అందుకు అంగీకరించిన తారా సింగ్ ఇండియన్ఆర్మీ యూనిట్‌కు శ్యామ్ చేయడమే కాకుండా పాకిస్థాన్ సైనికులతో పోరాటం చేస్తాడు. ఈక్రమంలో పాకిస్తాన్ ఆర్మీ తారాసింగ్ తో పాటుగా కొంతమంది ఇండియన్ సోల్జర్స్, ట్రక్ డ్రైవర్లను కూడా పట్టుకుని పాక్ జైలులో బంధిస్తారు. దీంతో సకీనా, చరణ్‌జీత్ సింగ్ చాలా బాధపడుతారు. తల్లి బాధను చూసి భరించలేని చరణ్‌జీత్ తండ్రిని భారత్ కు తీసుకురావడానికి సిద్ధపడతాడు. అతను ఎలా పాకిస్థాన్ వెళ్ళాడు? ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తండ్రిని కాపాడాడా? అనేది మిగలిన కథ.
హీరో సన్నీ డియోల్ తారా సింగ్ గా అద్భుతంగా నటించాడు. అమీషా పటేల్ పాత్ర నిడివి తక్కువగా ఉంది. ఉత్కర్ష్ శర్మ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సిమ్రత్ కౌర్ అందంగా కనిపించింది. ముస్తాక్ ఖాన్, ఎహసాన్ ఖాన్,  ముస్తాక్ కాక్ పాత్రల పరిధి మేరకు నటించారు.

Also Read: “ఈ మాట ఇప్పుడు అని ఏం లాభం..?” అంటూ… “భోళా శంకర్” మ్యూజిక్ డైరెక్టర్ పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

 

 


End of Article

You may also like