వైరల్ అవుతున్న కొత్త పెళ్లికూతురి నిర్వాకం.. పెళ్లి అయ్యాక భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టకుండా.. ఎంత పని చేసిందంటే?

వైరల్ అవుతున్న కొత్త పెళ్లికూతురి నిర్వాకం.. పెళ్లి అయ్యాక భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టకుండా.. ఎంత పని చేసిందంటే?

by Anudeep

Ads

ఇటీవల పెళ్లిళ్లలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో కళకళలాడాల్సిన కొత్త జంటలు అటు ఆహ్వానితులకు.. ఇటు ప్రజలకు చూడలేని షాకులు ఇస్తున్నారు. కొందరు పెళ్లి పీటల మీదే విడిపోతుంటే.. మరికొందరేమో మరొకరిని పెళ్లి చేసేసుకుని తాము చేసుకోబోయే వారికే షాకులు ఇస్తున్నారు.

Video Advertisement

తాజాగా.. ఇటువంటి మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ఘటన ఏంటో ఓ లుక్ వేయండి.

agra bride

కొత్తగా పెళ్లి చేసుకుని అట్టరనిటికి తన భర్తతో పాటు కలిసి వచ్చిన ఓ నవ వధువు చేసిన పని అక్కడ ఉన్న వారందరికీ షాక్ కు గురి అయ్యేలా చేసింది. ఇంట్లోకి అడుగు పెట్టకుండానే గుమ్మం వద్దే ఆమె అందరికీ షాకిచ్చింది. ఆమె చేసిన పని వలన చుట్టూ ఉండే ఇరుగు పొరుగు వారు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. ఆమె గురించి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

agra bride 1

ఆగ్రాకు చెందిన ఈ యువతీ యువకులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరికి వివాహం చేయడానికి ఇరు వర్గాల పెద్దలు అంగీకరించి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి అయ్యాక నూతన వధువురులను అత్తారింటికి తీసుకొచ్చారు. వారికి సంప్రదాయబద్ధంగా మంగళ హారతిని ఇచ్చారు. ఆమెను భర్తతో కలిసి లోపలకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే ఆమె లోపలకి రాకుండా భర్త సాయంతో తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపింది. దీనితో అక్కడ ఉన్న వారు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. భర్తతో కలిసి ఇంట్లోకి వెళ్లకుండా ఇవేమి పనులంటూ తిట్టిపోస్తున్నారు.


End of Article

You may also like