Ads
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఎంట్రీ సమయం లో నందమూరి అభిమానులు బాగా ఉత్సాహం గానే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరో గా, వి ఆర్ ప్రతాప్ దర్శకత్వం లో వచ్చిన సినిమా “నిన్ను చూడాలని”. ఈ సినిమా లో రవీనా రాజ్ పుత్ హీరోయిన్ గా నటించారు. కైకాల సత్య నారాయణ, అన్నపూర్ణ, సుధా, సుధాకర్, శివాజీ రాజా, కె.విశ్వనాధ్ వంటి ప్రముఖులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Video Advertisement
ఈ సినిమా లో రవీనా హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు. కానీ.. ఈ సినిమా తరువాత ఆమె మరే ఇతర సినిమాలోనూ నటించలేదు. జూనియర్ ఎన్టీఆర్ సరసన “నిన్ను చూడాలని” సినిమాలో నటించడానికి ముందే ఆమె వెంకటేష్ తో కలిసి ” ఒంటరి పోరాటం” అనే సినిమా లో నటించింది. 2001 లో నిన్ను చూడాలని సినిమా వచ్చింది. ఈ సినిమా తరువాత రవీనా రాజ్ పుత్ టాలీవుడ్ లో మళ్ళీ కనిపించలేదు.
టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ వంటి ఇతర చిత్ర పరిశ్రమలలో కూడా.. ఆమె ఏ సినిమాలోనూ నటించిన దాఖలాలు లేవు. “నిన్ను చూడాలని” అనే సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దానితో ఈ భామకు నటనపై ఆసక్తి సన్నగిల్లిందా..? అనే అనుమానాలు అప్పట్లో వచ్చాయి.
సినిమాలపై ఇంటరెస్ట్ లేకపోవడంతో.. ఈ భామ ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అయితే.. ఈమె సినిమాలకు ఎందుకు దూరమైంది అనే విషయమై.. రకరకాల రూమర్స్ వచ్చాయి కానీ, ఆమె వేటిపైనా స్పందించలేదు.
End of Article