“నూతన్ ప్రసాద్” గారి కొడుకుని చూశారా..? ఆయన పేరు ఏంటో తెలుసా..?

“నూతన్ ప్రసాద్” గారి కొడుకుని చూశారా..? ఆయన పేరు ఏంటో తెలుసా..?

by Harika

Ads

ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించే నటుల్లో మొదటిగా ఉండే వారిలో నూతన్ ప్రసాద్ గారు కూడా ఒకరు. ఈ తరం వారికి నూతన్ ప్రసాద్ గారు చాలా తక్కువగా తెలిసే అవకాశం ఉంది. కానీ ఆయన సినిమాల ద్వారా అందరికీ సుపరిచితులు. గతంలో ఆయనకి, ఆయన గొంతుకి ఎంతో మంది అభిమానులు ఉండేవారు. ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారి అసలు పేరు తాడినాడ వరప్రసాద్. నూతన్ ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరుకు చెందినవారు. దాదాపు 30 సంవత్సరాల పాటు సినిమాల్లో నటించారు.

Video Advertisement

nutan prasad son

గుంటూరులో ప్రదర్శించిన నా ఓటు అనే ఒక నాటకం ద్వారా నూతన్ ప్రసాద్ గారు తన కెరీర్ మొదలుపెట్టారు. 1973 లో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించిన అందాల రాముడు సినిమాతో సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఆ తర్వాత నీడలేని ఆడది సినిమాలో నటించారు. నూతన్ ప్రసాద్ గారికి ముత్యాలముగ్గు సినిమా ఇంకా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత రాజాధిరాజు సినిమా కూడా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, ఖైది, శ్రీవారికి ప్రేమలేఖ, ఆహ నా పెళ్ళంట, కథానాయకుడు సినిమాలు నూతన్ ప్రసాద్ గారిని అందరికీ చేరువయ్యేలా చేశాయి. ఐదు సినిమాలకి నూతన్ ప్రసాద్ గారు నంది అవార్డులు అందుకున్నారు.

నూతన్ ప్రసాద్ గారు చివరిగా 2009 లో వచ్చిన రాజు మహారాజు సినిమాలో నటించారు. నూతన్ ప్రసాద్ గారు నేరాలు-ఘోరాలు ప్రోగ్రాంకి తన గొంతుని కూడా అందించారు. అందులో చూపించే సంఘటనలని కళ్ళకు కట్టినట్టుగా చెప్పేవారు. అందుకే నూతన్ ప్రసాద్ గారి గొంతుకి కూడా అంత మంది అభిమానులు ఉన్నారు. అయితే, నూతన్ ప్రసాద్ గారి గురించి మనందరికీ తెలుసు కానీ, వారి పిల్లల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. నూతన్ ప్రసాద్ గారి కొడుకు పేరు పవన్ తాడినాడ. పవన్ గారి భార్య పేరు శ్రీ హిమబిందు. హిమబిందు గారు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. తనదైన స్టైల్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. తన కుటుంబానికి సంబంధించిన పోస్ట్ లు కూడా చేస్తూ ఉంటారు. తన పోస్ట్ ల ద్వారా నూతన్ ప్రసాద్ గారిని కూడా అందరికీ గుర్తు చేస్తూ ఉంటారు.


End of Article

You may also like