Ads
కరోనా మహమ్మారిని అంతం చేయడం కోసమే వాక్సిన్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే.. మనదేశం లో మొదట్లో వాక్సిన్ వేయించుకోవడానికి.. జనాలు ముందుకు రాలేదు. కానీ, అవేర్ నెస్ పెరిగి.. అందరు వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల వాక్సిన్ దొరకడం ఆలస్యమవుతోంది. మరో వైపు అమెరికా లో కూడా కొన్ని చోట్ల వాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దీనితో.. ప్రజలను వాక్సిన్ వేయించుకోవాలని.. వేయించుకున్నవారికి లాటరి టికెట్ ఇస్తామంటూ అమెరికా లోని ఒహియో రాష్ట్రము బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు.
Video Advertisement
ఈ లాటరీ గెలిచినా వారికి ఒక మిలియన్ డాలర్లను బహుమానం గా ఇస్తారట. అంటే.. అక్షరాలా ఏడు కోట్ల రూపాయలు బహుమానం గా ఇస్తారట. మే 26 వ తేదీన ఈ లాటరి ని ఓపెన్ చేస్తారట. 18 సంవత్సరాలు పైబడిన వారికి ఈ లాటరి టికెట్ ఇస్తారట. మే 18 వ తేదీనుంచి ఈ రిజిస్ట్రేషన్ మొదలు పెడతారట. అలాగే.. 17 ఏళ్ల వయసు లోపు వారు వేసుకుంటే.. వారికి నాలుగేళ్ళ వరకు రాష్ట్రము లో యూనివర్సిటీలలో ఉపకార వేతనం ఇస్తారట. దీనితో.. ఆ రాష్ట్రము లో పెద్ద ఎత్తున జనాలు వాక్సిన్ కోసం క్యూ కడుతున్నారట.
End of Article